ఏపీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారు తక్కువగా ఉన్నార. చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో రోజువారీ అవసరాలతో పోలిస్తే భారీ సంఖ్యలో వ్యాక్సిన్ నిల్వలు మిగిలి ఉన్నాయి. చాలా ఆసుపత్రులు తమ స్టాక్లు పూర్తిగా వినియోగించబడిన తర్వాత టీకా కేంద్రాలను మూసివేసాయి. బుధవారం రాష్ట్రంలోని 45 ఆసుపత్రులు మాత్రమే తమ తమ కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేయగా, ప్రభుత్వం 2,756 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ను అందించింది. CoWIN పోర్టల్ ప్రకారం, రాత్రి 7 గంటల నాటికి రాష్ట్రంలో మొత్తం 2.52 లక్షల డోసులు అందించబడ్డాయి.
తమ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గిందని విజయవాడలోని ఓ ప్రవేట్ ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20 నుంచి 30 డోస్లు ఇస్తున్నామని, 500 డోసులకు పైగా స్టాక్ ఉందన్నారు. నగరంలోని మరో ఆసుపత్రిలో రోజుకు 10 డోస్ల కంటే తక్కువ వ్యాక్సినేషన్ జరుగుతుందని.. 100 డోస్లు స్టాక్లో ఉన్నాయని వైద్యులు తెలిపారు. నగరంలో మరియు ఇతర ప్రాంతాల్లోని అనేక ఆసుపత్రుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మొదటి డోస్ యొక్క కవరేజీ పెరగడం వల్ల ప్రజల్లో వ్యాక్సిన్ల కోసం డిమాండ్ తగ్గింది.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కేవలం ఐదు ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇవ్వగా, అన్నీ కలిపి లక్షలోపు మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశాయి. ఐదు ఆసుపత్రుల్లో మూడింటిలో టీకాలు వేయడం ఆపివేయడంతో పాటు నిల్వలు లేవు. ఈ జిల్లాలకు చెందిన ఇమ్యునైజేషన్ అధికారులు కె.విశ్వేశ్వర రెడ్డి, పి.యుగంధర్లు మాట్లాడుతూ ఈ ఆసుపత్రుల్లో మొదటి డోస్ తీసుకున్న వ్యక్తులను గుర్తించి వారికి ప్రభుత్వాసుపత్రుల్లో రెండో డోస్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రకాశం జిల్లాలో 7.17 లక్షల మంది ప్రజలు ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు. ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అత్యధికంగా 5.36 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. జిల్లాలో రెండు లక్షల డోసుల వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న జనాభాలో 86% మంది కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ని పొందారు. అయితే అర్హత ఉన్న జనాభాలో 60% మందికి పూర్తిగా టీకాలు వేశారు. టీకా డ్రైవ్లకు పేలవమైన ప్రతిస్పందనతో, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా టీకాలు వేయని వ్యక్తులను వార్డు మరియు గ్రామ వాలంటీర్లు, ANMలు మరియు ఇతరులతో ఇంటింటికి సర్వే చేపిస్తుంది. ఇప్పటి వరకు 3.41 కోట్ల మొదటి డోసులు, 2.38 కోట్ల రెండో డోస్లు కలిపి మొత్తం 5.79 కోట్ల డోసులు అందించారు.