కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని చాలామంది తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివమొగ్గ కోవిడ్ 19 నిపుణుల కమిటీ ప్యానెల్ అభిప్రాయపడింది. విద్యాసంస్థలు తరగతులు నిర్వహించడానికి అనుమతించవచ్చని ప్యానెల్ తెలిపింది. శివమొగ్గ డిప్యూటీ కమిషనర్ ఆర్.సెల్వమణి నిపుణులతో సమావేశం నిర్వహించారు . డాక్టర్ ధనంజయ్ సర్జీ, డాక్టర్ శ్రీకాంత్ హెగ్డే, డాక్టర్ మల్లికార్జున్ కొప్పాడ్, డాక్టర్ పాటిల్. డాక్టర్ సతీష్ చంద్ర, డాక్టర్ నాగరాజ్ నాయక్, డాక్టర్ మల్లప్ప మరియు శివమొగ్గ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ సిద్దప్ప సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారు.
పిల్లలకు కరోనా సోకితే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పిల్లలపై సంక్రమణ ప్రభావం స్వల్పంగా ఉంటుందని కమిటీలోని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే విద్యా సంస్థలు కోవిడ్ 19 ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని.. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్న పిల్లలను ఇంటికి పంపించి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలన్నారు.శివమొగ్గలో అంటువ్యాధుల గణాంకాలను పరిశీలిస్తే ఆసుపత్రిలో చేరాల్సిన వారి సఖ్య తక్కువగా ఉంది. సోకిన వ్యక్తులలో (జనవరి 19 నాటికి, మొత్తం క్రియాశీల కేసులు 1,688), కేవలం 63 మంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఇద్దరికి మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం అవసరమైంది.
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ థర్డ్ వేవ్ ప్రభావం రెండు డోస్లతో టీకాలు వేసిన వ్యక్తులపై తక్కువగా ఉంటుందని డిప్యూటీ కమిషనర్ ఆర్. సెల్వమణి తెలిపారు. హోమ్ ఐసోలేషన్ సమయంలో వారు కోలుకుంటారని.. టీకాలు వేయని 17 మంది ఆసుపత్రి పాలయ్యారని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో అర్హత కలిగిన వ్యక్తులలో 99% మంది కోవిడ్-19 వ్యాక్సిన్ను కనీసం ఒక డోస్ తీసుకున్నారని, 84% మంది రెండు డోస్లను పూర్తి చేశారని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.