Site icon HashtagU Telugu

Mysuru Maharaja : ఎన్నికల బరిలో మైసూర్ మహారాజా.. కారు, ఇల్లు కూడా లేవట!

Mysuru Maharaja

Mysuru Maharaja

Mysuru Maharaja : మైసూర్ రాజవంశ వారసుడు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడియార్‌ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.  మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. దీంతో సోమవారమే ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. వాస్తవానికి ఈనెల 3న నామినేషన్‌ దాఖలు చేయాలని భావించారు. అయితే సోమవారం మంచిరోజు కావడంతో యదువీర్‌ రెండు రోజుల ముందే నామినేషన్‌ వేసినట్లు సమాచారం. తన తల్లి ప్రమోదా దేవి, బీజేపీ ఎమ్మెల్యే శ్రీవత్సతో కలిసి మైసూరులోని ఎన్నికల కార్యాలయానికి వెళ్లి రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలు అధికారికి అందజేశారు. మరో సెట్‌ను బుధవారం దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడ్‌విట్‌లో తన ఆస్తుల వివరాలను యదువీర్‌ వెల్లడించారు. పూర్తి వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

Also Read : Ravi Kota : అసోం సీఎస్‌గా తెలుగు ఐఏఎస్‌ అధికారి.. నేపథ్యమిదీ

కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉన్నారంటే..

మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ ఫోకసే పెట్టింది. మైసూరుపై తన పట్టును నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారు. ఈ స్థానం నుంచి కర్ణాటక పీసీసీ అధికార ప్రతినిధి కె.లక్ష్మణ్‌ను బరిలోకి దింపారు.  ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీగా  ఉన్న ప్రతాప సింహను పక్కన పెట్టి మరీ  మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీరకు టికెట్ ఇచ్చింది.

మైసూరు రాజ్యం చరిత్ర