600 Diamonds Crown : తమిళనాడుకు చెందిన ముస్లిం భరతనాట్యం డ్యాన్సర్ జాకిర్ హుస్సేన్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయన ఒక ముస్లిం అయినప్పటికీ.. హిందూ మతంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రత్యేకించి తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగం రంగనాథర్ స్వామి అంటే ఆయనకు ఎంతో భక్తి. ఆ భక్తిభావంతోనే తాజాగా ఆయన శ్రీరంగం రంగనాథర్ స్వామి ఆలయానికి ఒక అపురూపమైన కానుకను అందించారు. 600 చిన్నచిన్న వజ్రాలతో అలంకరించిన రూబీ కిరీటాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన జాకిర్ హుస్సేన్.. దాన్ని స్వామివారికి కానుకగా అందించారు. స్వయంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కిరీటాన్ని అందజేశారు. మన దేశంలో పూర్తిస్థాయిలో రూబీతో తయారు చేయించిన తొలి దేవతా కిరీటం ఇదేనని జాకిర్ హుస్సేన్ చెప్పారు. ‘‘మీరు ముస్లిం కదా ?’’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన ఇలా బదులిచ్చారు. ‘‘నేను ముస్లింనే ఔను.. నేను అంతకంటే ముందు ఇక ఇండియన్ను. నాకు రంగనాథర్ స్వామి అంటే ఇష్టం. అందుకే ఆయనకు ఈ కానుకను అందించాను’’ అని జాకిర్ హుస్సేన్ బదులిచ్చారు.
600 Diamonds Crown : స్వామివారిపై ముస్లిం డ్యాన్సర్ భక్తి.. 600 వజ్రాలతో కిరీటం
