అన్నాడీఎంకే పార్టీకి ఏకైక నాయకత్వాన్ని పళనీస్వామికి అప్పగించాలని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆయన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఇటీవల పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ వివాదంపై కోర్టుకు వెళ్లిన పళనీ, పన్నీర్ వాదనలను హైకోర్టు సావదానంగా పరిశీలించిన తరువాత పళనీ స్వామి అన్నాడీఎంకే పార్టీకి ఏకైక నాయకునిగా తీర్పు చెప్పింది.
కింద కోర్టు ఓ పన్నీర్సెల్వం (OPS)కి అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) అప్పీలును మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. న్యాయమూర్తులు ఎం దురైస్వామి, సుందర్ మోహన్లతో కూడిన డివిజన్ బెంచ్, జూలై 11న జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ (జీసీ) సమావేశాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులను పక్కన పెట్టింది.
జూలైలో జరిగిన ఆ సమావేశంలో ప్రతిపక్ష నేత కె. పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. జీసీ సమావేశంలో పన్నీర్సెల్వం పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజా కోర్టు ఆదేశాలతో ఏఐఏడీఎంకే ఏకైక, అత్యున్నత నాయకుడిగా పళనిస్వామి స్థిరపడ్డారు. జూన్ 23 నాటికి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిన జస్టిస్ జి జయచంద్రన్ ఆగస్టు 17 నాటి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. జూన్లో ఆ రోజున పన్నీర్ సెల్వం సమన్వయకర్తగా మరియు పళనిస్వామి జాయింట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఇక నుంచి పళనీస్వామి అన్నాడీఎంకే సుప్రీమ్ గా ఉంటారు.