Site icon HashtagU Telugu

Lokayukta Raids: లోకాయుక్త దాడులతో కర్ణాటకలో హైటెన్షన్

Lokayukta Raids

New Web Story Copy (19)

Lokayukta Raids: కర్ణాటక లోకాయుక్త దాడులతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్రవ్యాప్తంగా 48 చోట్ల ఏకకాలంలో ప్రభుత్వ అధికారుల నివాసాలు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. బెంగళూరు, బీదర్, కొడగు, చిత్రదుర్గ, దావణగెరె తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి.ఈ దాడుల్లో 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్లు లోకాయుక్త వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరులో అధికారులపై నమోదైన నాలుగు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి లోకాయుక్త 10 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.

ఎస్పీ నంజుండే గౌడ నివాసంలో అధికారులు దాడులు నిర్వహించారు. అతని మామగారి నివాసం, మైసూరు నగరంలోని అతని బంధువుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. మడికేరిలోని ఆయన నివాసంలో లోకాయుక్త అధికారులు నగదు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లోకాయుక్త ఎస్పీ సురేష్ బాబు నేతృత్వంలోని బృందం తెల్లవారుజామున 4 గంటలకు దాడులు ప్రారంభించింది, ఈ దాడులను ఎదుర్కొన్నారు బెలగావి సిటీ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్ అనిషెట్టార్. అతని నివాసంపై కూడా దాడి జరిగింది. కాగా ఈ దాడుల్లో భారీ మొత్తంలో నల్లధనం వెలికిచూసింది. దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Vande Bharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు