National Flag: ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో భారతదేశానికి బ్రిటీష్ వారి పాలన నుండి విముక్తి వచ్చింది. దీంతో ఆ రోజును ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవంగా (National Flag) జరుపుకుంటాం. ఈరోజున దేశమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ 78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోటపై జెండావిష్కరణ చేశారు. ఆ తర్వాత దేశమంతటా స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఈ క్రమంలోనే కేరళలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వీడియోని బట్టి చూస్తే కేరళలోని ఓ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్పష్టం అవుతోంది. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కేరళలోని ఓ ప్రాంతంలో ఉపాధ్యాయులు స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి జెండావిష్కరణ కోసం తాడును పైకి లాగాడు. అయితే పై భాగానికి వెళ్లిన జెండా చిక్కుముడి పట్టి జెండా ఎగరలేదు.
We’re now on WhatsApp. Click to Join.
కేరళ లో జాతీయ జెండా ఎగురవేస్తుండగా పైభాగంలో ఇరుక్కుపోయింది.. ఎక్కడి నుండో ఒక పక్షి వచ్చి ఇర్రుక్కుపోయిన పైభాగాన్ని విప్పేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది! pic.twitter.com/695Z68rZ04
— ChotaNews (@ChotaNewsTelugu) August 17, 2024
అయితే ఇది గమనించిన ఓ పక్షి వచ్చి జెండాకు పడిన ముడిని విప్పింది. ఆ వెంటనే వచ్చిన దారిలోనే ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ పక్షి చిక్కుముడి విప్పిన తర్వాత జెండావిష్కరణ కార్యక్రమం సజావుగా సాగింది. అయితే ఈ ఘటనను స్థానికులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఇలా జరగటంతో అక్కడ ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే కేరళలో ఈ ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీగా తెలియదు. అయితే ఈ వీడియో నిజం కాదని కొందరు మరో వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ పక్షి చెట్టు మీద వాలిందని, జాతీయ జెండా ముడి విప్పలేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతూ వీడియోలు సైతం పెడుతున్నారు.
Also Read: Investment: నెలకు రూ. 1000 పెట్టుబడి.. రూ. 3 లక్షలకు పైగా రాబడి, స్కీమ్ ఇదే..!
Let's look from another view. pic.twitter.com/p3hIs6j3Kn
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) August 17, 2024