Dowry Case : భార్య‌ను చంపేందుకు సుపారీ ఇచ్చిన భ‌ర్త‌.. కార‌ణం ఇదే..?

క‌ట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఓ ముఠాకు ‘సుపారీ’ ఇచ్చి ఎలాగైన...

  • Written By:
  • Updated On - September 22, 2022 / 02:55 PM IST

క‌ట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఓ ముఠాకు ‘సుపారీ’ ఇచ్చి ఎలాగైన త‌న భార్య‌ను చంపాల‌ని చెప్పాడు ఓ భ‌ర్త‌. అయితే ప్లాన్ అంతా బెడిసి కొట్టి స‌ద‌రు భ‌ర్త క‌ట‌క‌ట‌ల‌పాలైయ్యాడు. ఈ కేసులో కర్ణాటక పోలీసులు ఒక వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.సిద్ధార్థ్ హోసమణి, అంబులెన్స్ హెల్పర్ యోగేష్, డ్రైవర్ రంజిత్‌లను అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న రౌడీషీటర్ బెట్టప్పపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హోసమణి పదేళ్ల క్రితం వితంతువును పెళ్లి చేసుకున్నాడు. అతను వారి కుటుంబానికి బీమా చేయించుకున్నాడు. ఆమె భర్త మరణించినప్పుడు అతను క్లెయిమ్‌లను గ్రహించడంలో సహాయం చేశాడు. వితంతువు హోసామణితో కాస్త స‌న్నిహితంగా ఉండ‌టంతో బంధం ఏర్ప‌డింది.

ఆ తరువాత వారు వివాహం చేసుకున్నారు వీరిద్ధ‌రికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే హోసమణికి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని తన మొదటి భార్య సోదరికి రెండో భార్యకు పుట్టిన కొడుకును ఇచ్చాడు. రెండో భార్య తన కొడుకును తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై కట్నం, పిల్లల కిడ్నాప్‌పై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో హొసమణి జైలుకు వెళ్లి బెయిల్ పొందారు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు రెండో భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. కిడ్నాప్‌ చేసేందుకు నిందితులు రంజిత్‌, యోగేష్‌ల సహాయం కోరగా, ఆమెను హత్య చేసేందుకు మరో ముఠాకు ‘సుపారీ’ ఇచ్చాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.