Farmer: ఆన్లైన్ శిక్ష‌ణ పొందుతున్న క‌ర్ణాట‌క రైతులు

మైసూరులోని జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రం (DATC) నుండి గత ఏడాది కాలంలో 10,000 మందికి పైగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులపై ఆన్‌లైన్ శిక్షణను పొందారు.

  • Written By:
  • Updated On - February 6, 2022 / 10:14 AM IST

మైసూరులోని జిల్లా వ్యవసాయ శిక్షణా కేంద్రం (DATC) నుండి గత ఏడాది కాలంలో 10,000 మందికి పైగా రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులపై ఆన్‌లైన్ శిక్షణను పొందారు. రెండేళ్ళ క్రితం కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో రైతులకు తాజా పరిణామాలను తెలియజేయడానికి, పరిష్కారాలను అందించడానికి ప్రారంభించబడింది. మొదట్లో మైసూరులో రైతులకు శిక్షణ ఇచ్చేవారు.

కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్‌లు సర్వత్రా అందుబాటులోకి రావడం, వాట్సాప్ ఒక ప్రముఖ మెసెంజర్ సేవ కావడం వల్ల, వ్యవసాయ సంఘం ద్వారా లింక్‌లు విస్తృతంగా షేర్ చేయబడతాయని DATC డిప్యూటీ డైరెక్టర్ జి.హెచ్. యోగేష్ తెలిపారు. ఫలితంగా ఆన్‌లైన్ పాఠాలు మైసూరు జిల్లాలోని అడవులు, జాతీయ ఉద్యానవనాల అంచున ఉన్న మారుమూల‌, అందుబాటులో లేని ప్రాంతాల రైతులకు చేరుతున్నాయి. వ్యవసాయ అధికారులకు క్షేత్ర మరియు సాంకేతిక సహాయాన్ని అందించడానికి DATC స్థాపించి.. వారికి క్రమ శిక్షణను నిర్వహిస్తోంది. కానీ కోవిడ్-19 మహమ్మారి ప్రారంభంతో, DATC ఆన్‌లైన్ శిక్షణతో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 56 ఆన్‌లైన్ శిక్షణా తరగతులు నిర్వహించ‌గా… 10,806 మంది రైతులు శిక్షణ పొందారు. అదనపు తరగతులు ప్రారంభమయ్యే సమయానికి మరో రెండు నెలల సమయం ఉంద‌ని యోగేష్ తెలిపారు.