Sole Survivor:ఆర్మీ హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన ఏకైక వ్య‌క్తి ఈయనే…!

తమిళనాడులో జ‌రిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ ఆయ‌న భార్య‌తో పాటు మ‌రో 11 మంది చనిపోయారు.

Published By: HashtagU Telugu Desk
Fgfwz3yxea4bp N Imresizer

Fgfwz3yxea4bp N Imresizer

తమిళనాడులో జ‌రిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ ఆయ‌న భార్య‌తో పాటు మ‌రో 11 మంది చనిపోయారు. ఈ ప్ర‌మాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర కాలిన గాయాలతో వెల్లింగ్టన్‌లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత సంవత్సరం ప్రధాన సాంకేతిక సమస్యల కారణంగా తన విమానాన్ని హ్యాండిల్ చేయడంలో ధైర్యం చూపినందుకు శౌర్య చక్ర అవార్డుని సింగ్ అందుకున్నాడు. మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ ఆయ‌న తన తేజస్ యుద్ధ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. సింగ్ ని కోయంబత్తూరుకి తరలించాలని వైమానిక దళం నిర్ణయిస్తే..అక్క‌డ‌ చికిత్స అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

బిపిన్ రావ‌త్ మ‌ర‌ణంపై దేశ ప్ర‌ధాని, ర‌క్ష‌ణ‌మంత్రితో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, మంత్రులు సంతాపం తెలిపారు. బిపిన్ రావ‌త్ అకాల మరణం దేశ సాయుధ బలగాలకు, దేశానికి తీరని లోటు అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. “జనరల్ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడని… నిజమైన దేశభక్తుడని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఆయ‌న దేశ‌ సాయుధ బలగాలు, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో గొప్పగా దోహదపడ్డాడ‌ని అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

జనరల్ రావత్ 2019లో భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమితుడయ్యాడు. సైన్యం, వైమానిక దళం, నావికాదళాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే బాధ్యతను ఆయ‌న‌కు అప్పగించారు.ఆయ‌న పర్యవేక్షణలో కాశ్మీర్‌లో 40 మంది పారామిలటరీ దళాలను చంపిన పెద్ద ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది.

  Last Updated: 08 Dec 2021, 10:35 PM IST