ఢిల్లీ క్యాపిటల్స్ని కరోనా మహామ్మారి కలవరపెడుతుంది. మిచెల్ మార్ష్కు కోవిడ్-19 పాజిటివ్ అని వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నెగిటివ్గా రిపోర్ట్ వచ్చింది.ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫర్హార్ట్ తో పాటు కోచింగ్ సిబ్బందిలో మరోకరికి పాజిటివ్గా నిర్థారణ అయింది.
మంగళవారం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అందరిని వారి హోటల్ గదులలో ఉండాలని సూచించారు. మొదటి రౌండ్ నెగెటివ్గా వచ్చినప్పటికీ మరిన్ని పరీక్షలు చేసేందుకు బీసీసీఐ మరో వైద్య బృందాన్ని పంపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడగా.. మిచెల్ మార్ష్ ఈ సీజన్లో తన మొదటి మ్యాచ్ ఆడాడు 2020లో రన్నరప్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం రెండింటిని మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఐపీఎల్ చివరి రెండు ఎడిషన్లపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది.