CM Stalin: అన్నాడీఎంకే పై స్టాలిన్ ఆగ్రహం.. అస‌లు రీజ‌న్ ఇదే..!

  • Written By:
  • Publish Date - February 14, 2022 / 04:40 PM IST

త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే ప్ర‌భుత్వం రాష్ట్ర ఖ‌జానాను ఖాళీ చేసింద‌ని, దీంతో త‌మిళ‌నాడు ఆర్ధిక ప‌రిస్థితిని గాడిలో పెట్టేందుకు త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. త‌మిళ‌నాడు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా దిండుగల్‌ జిల్లాలో పోటీచేస్తున్న డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా అన్నా అరివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం స్టాలిన్ తాజాగా మాట్లాడారు.

స్టాలిన్‌ ప్రసంగాన్ని జిల్లాలోని 150కి పైగా ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేసి ప్రజలు చూసే విధంగా జిల్లా పార్టీ శ్రేణులు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఓపీఎస్‌, ఈపీఎస్‌ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అవినీతి అనకొండలా వుండేదని, సంక్షేమ‌ పథకాలు అమలు ముసుగులో, రాష్ట్ర‌ ఖజానాను పూర్తిగా ఖాళీ చేశార‌ని, దీంతో దిగ‌జారిన త‌మ‌ళ‌నాడు ఆర్ధిక ప‌రిస్థిని మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం స్టాలిన్ అన్నారు. మ‌రి స్టాలిన్ వ్యాఖ్య‌ల‌పై అన్నాడీఎంకే నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.