Eating on Rocks: ఇదేక్కడి ఆచారం బాబోయ్.. ఊరు ఊరంతా బండరాయిపైనే భోజనం.. కారణం?

భారతదేశంలో ఇప్పటికీ ఎన్నో ప్రదేశాలలో ఆచారాలను, సంప్రదాయాలను మూఢనమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు.

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 10:12 PM IST

భారతదేశంలో ఇప్పటికీ ఎన్నో ప్రదేశాలలో ఆచారాలను, సంప్రదాయాలను మూఢనమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు. అయితే మూఢనమ్మకాల గురించి పక్కన పెడితే ఆచార సంప్రదాయాలను మాత్రం ప్రజలు తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారు. ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీ కురుమూర్తి స్వామి. పాదానికి గుడి కట్టించి 200 సంవత్సరాల నుంచి ఉత్సవాలను జరపడంతో పాటుగా, అక్కడ ఉన్న బండ రాతిపై గ్రామస్తులు అందరూ కలిసి శ్రావణమాస చివరి వారంలో భోజనాలు కూడా చేస్తారట. మరి ఆ ఊరి పెద్దలు అలా ఎందుకు చేస్తారు. ఆ ఊరు ఎక్కడ ఉంది? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తెలంగాణ లోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకటగిరి గ్రామస్తులు ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శనివారం రోజున గ్రామ సమీపంలోని కురుమూర్తి స్వామి పాదం బండ పై భోజనం చేస్తారు. అది కూడా బండ పై ఎలాంటి విస్తరాకులు కానీ,ప్లేట్లు గానీ లేకుండా ఆ రాతి బండ పై అలాగే అన్నం పెట్టించుకుని పచ్చిపులుసు వేసుకుని గ్రామస్తులు అందరూ కలిసి తింటారట. అయితే వెంకటేశ్వర స్వామి, కురుమూర్తి జాతర కు వెళుతూ మా గ్రామ సమీపంలోని బండ పై కాలు మోపడం తో ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరిగేదని ఇక్కడి పూర్వీకులు చెప్పినట్టుగా అక్కడి గ్రామస్తులు నమ్ముతుంటారు.

అయితే ప్రతి ఏడాది కూడా శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున గ్రామస్తులందరూ కలిసి ప్రతి ఇంటి నుంచి బియ్యం, నూనె,చింతపండు, ఉల్లిగడ్డలు అన్నీ సేకరించి పాదం బండ దగ్గరికి వచ్చి వంటలు చేసుకొని, అక్కడ ఉన్న ఆ రాతి బండ పైన ఎలాంటి విస్తరాకులు లేకుండా భోజనం చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, గొడ్డు గోదా గ్రామస్తులంతా క్షేమంగా ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం.