రోబోలు శాస్త్ర సాంకేతిక రంగంలోనే ముద్ర వేయడం కాకుండా అన్ని రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే వెయిటర్స్ గా, సరిహద్దుల్లో సైనికులుగా పనిచేసిన రోబోలను మాత్రమే చూశాం. ఇక నుంచి పూజారిగా అవతారమెత్తనున్నాయి రోబోలు. వెల్లూరులోని ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో రోబోలు దసరా ఆయుధ పూజ నిర్వహించాయి. ఒక రోబో గంట మోగించగా.. మరో రోబో దుర్గా మాతకు హారతి సమర్పించే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది. దుర్గామాతకు హారతి ఇచ్చిన తర్వాత భక్తులు ఆ రోబో వద్దకు వెళ్లి హారతి తీసుకున్న వీడియోలను VIT సంస్థ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
🔴వెల్లూరులోని ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో రోబోలు దసరా ఆయుధ పూజ నిర్వహించాయి.
🔴ఒక రోబో గంట మోగించగా.. మరో రోబో దుర్గా మాతకు హారతి సమర్పించే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటోంది.#AyudhaPoojai #Robots #Robotics #Automation @VIT_univ pic.twitter.com/NEpwsVYwlq— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) October 4, 2022