Modi Birthday Special : ప్రధాని పుట్టినరోజు రెస్టారెంట్ బంపర్ ఆఫర్..8లక్షల గెలుచుకునే ఛాన్స్..!!

సెప్టెంబర్ 17న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా...మోదీ అభిమానులు ఈసారి భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేశారు.

  • Written By:
  • Publish Date - September 16, 2022 / 08:21 AM IST

సెప్టెంబర్ 17న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా…మోదీ అభిమానులు ఈసారి భారీగా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ రుచికరమైన థాలీని అందించేందుకు రెడీ అయ్యింది. రెస్టారెంట్ యజమాని సుమిత్ర కల్రా ఏకంగా థాలీకి 56 అంగుళాల మోడీజీ అని పేరు పెట్టారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా రుచికరమైన వంటకాలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. మోదీ అంటే మాకు ఎంతో గౌరవం ఉందని..ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెస్టారెంట్ నుంచి బహుమతి అందజేస్తామని తెలిపారు.

అంతేకాదు సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26వరకు దేశవ్యాప్తంగా మోదీ పుట్టిన రోజు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ తేదీల మధ్య తమ రెస్టారెంట్లో ఫుడ్ తినే కస్టమర్లు 8లక్షల ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకునే ఛాన్స్ ఉందని తెలిపారు. బహుమతి గెలుచుకున్నవారికి కేథార్ నాథ్, ఛార్ దామ్ యాత్రకు పంపించనున్నట్లు రెస్టారెంట్ యజమాని తెలిపారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా కానుకగా నిలుస్తుందన్నారు.

మరోవైపు, అస్సాం రాజధాని గౌహతిలో, జానపద కళలు, సంప్రదాయాల ద్వారా జాతీయవాదాన్ని బలోపేతం చేయడానికి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజ్ఞా ప్రవాహ, సంస్కార భారతి, విజ్ఞాన భారతి, సాహిత్య పరిషత్, చరిత్ర సంకలన కమిటీ , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన వనవాసి కళ్యాణ్ ఆశ్రమం కృషితో రాష్ట్రీయ విమర్శ లోకమంతన్- 2022 సెప్టెంబర్ 22 నుండి 24 వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా హాజరుకానున్నారు. ప్రజ్ఞా ప్రవాహ జాతీయ కన్వీనర్ జె.నందకుమార్ మాట్లాడుతూ జానపద కళలు, సంప్రదాయాల ద్వారా దేశాన్ని ఐక్యతా దారంలో కట్టిపడేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.