Indian Railway : వామ్మో.. ఈ రైలులో టికెట్ కొనుక్కొని వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే !!

Indian Railway : ప్యాలెస్ ఆన్ వీల్స్ (palace on wheels train) అనే లగ్జరీ రైలు దానికి పరాకాష్ట.

Published By: HashtagU Telugu Desk
Palace On Wheels Train

Palace On Wheels Train

భారతీయ రైల్వేలు (Indian Railways) ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలిచినప్పటికీ, అందులో కొన్నిరైళ్లు సామాన్యుడికి అందనంత దూరంలో ఉంటాయి. ప్యాలెస్ ఆన్ వీల్స్ (palace on wheels train) అనే లగ్జరీ రైలు దానికి పరాకాష్ట. ఇది దేశంలో అత్యంత ఖరీదైన రైళ్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలులో 8 రాత్రులు, 7 పగలు జరగే ప్రయాణానికి టికెట్ ధర రూ.12 లక్షల (Rs. 12 lakh) నుండి ప్రారంభమై రూ.39 లక్షల (థిస్. 39 lakh) వరకూ ఉంటుంది. టికెట్ ధర, ప్రయాణ సీజన్, ఎంచుకున్న క్యాబిన్ రకం (డీలక్స్, సూపర్ డీలక్స్, ప్రెసిడెన్షియల్ సూట్) వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Palace On Wheels Train3

Palace On Wheels Train2

Palace On Wheels Train1

ఈ రైలు ఢిల్లీ నుంచి ప్రారంభమై రాజస్థాన్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలైన జైపూర్, సవాయి మాధోపూర్, చిత్తోర్‌గఢ్, ఉదయపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, భరత్‌పూర్, ఆగ్రా వంటి చారిత్రక ప్రదేశాల గుండా ప్రయాణిస్తుంది. ఇది రైలు ప్రయాణాన్ని సాంప్రదాయ రాజరిక జీవనశైలికి దగ్గరగా తీసుకెళ్లే విధంగా రూపొందించబడింది. ప్రయాణికులకు భారత సంస్కృతి, చరిత్ర, రాజపుట ప్రాంపర్యాన్ని ఆస్వాదించే అనుభూతిని కలిగించేలా ఈ ట్రిప్‌ ఉంటుంది. ఇది సాధారణ రైలు కంటే మినీ ప్రాసెస్‌షన్‌లా ఉంటుంది – ప్రాచీన రాజమహల్‌లను తలపించే సౌకర్యాలతో.

ఈ లగ్జరీ రైలు సౌకర్యాల్లో ఎయిర్ కండిషన్డ్ విలాసవంతమైన క్యాబిన్లు, అద్భుతమైన బాత్రూములు, ప్రత్యేక భోజన ఎంపికలతో కూడిన రెస్టారెంట్లు, బార్ లాంజ్, స్పా వంటి సౌకర్యాలు ఉన్నాయి. 1982లో ప్రారంభమైన ఈ రైలు, ముఖ్యంగా విదేశీ పర్యాటకుల కోసమే రూపొందించబడింది. ఒక్క రాత్రి ప్రయాణ ఖర్చే రూ.1,08,700 ప్రారంభ ధరగా ఉండడం, ఇది భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రెండు బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌కు సమానమైందని చెప్పుకోవచ్చు. ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు, రైలు ప్రయాణం అంటే సామాన్యునికి మామూలుగా ఉండే అనుభవాన్ని – ఆర్భాటంగా, రాజకీయం చేసిన ఘనత కలిగి ఉంది.

CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు

  Last Updated: 08 Jun 2025, 08:03 PM IST