NCP CHIEF : ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్…ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ప్రకటన..!!

  • Written By:
  • Publish Date - November 1, 2022 / 06:10 AM IST

NCPఅధినేత శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడటంతో ముంబాయిలోని బ్రీచ్ కాడీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈమేరకు శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పవార్ అనారోగ్యానికి గురయ్యారని…వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్చారని…ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే తెలిపారు.

ఇది కూడా చదవండి : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!!

మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటారని చెప్పారు. బుధవారం పవార్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 3 గురువారం జరిగే పార్టీ సమావేవానికి శరద్ పవార్ హాజరవుతారని చెప్పారు.