NCPఅధినేత శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. ఆయన అనారోగ్యం బారినపడటంతో ముంబాయిలోని బ్రీచ్ కాడీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈమేరకు శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. పవార్ అనారోగ్యానికి గురయ్యారని…వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్చారని…ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే తెలిపారు.
ఇది కూడా చదవండి : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!!
మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటారని చెప్పారు. బుధవారం పవార్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 3 గురువారం జరిగే పార్టీ సమావేవానికి శరద్ పవార్ హాజరవుతారని చెప్పారు.
राष्ट्रवादी काँग्रेस पक्षाचे राष्ट्रीय अध्यक्ष आदरणीय शरद पवार साहेब यांची प्रकृती ठीक नसल्यामुळे पुढील तीन दिवस पवार साहेबांना मुंबईतील ब्रीज कॅन्डी रुग्णालयात उपचारासाठी दाखल करण्यात येणार आहे. #NCP pic.twitter.com/YpjqjcFw1E
— NCP (@NCPspeaks) October 31, 2022