Indigo : ఇండిగో ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు…టేకాఫ్ నిలిపివేత…తప్పిన ముప్పు..!!

  • Written By:
  • Publish Date - October 29, 2022 / 04:34 AM IST

ఢిల్లీ నుంచి బెంగుళూరు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన తర్వాత ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టేకాఫ్ చేయకుండా ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. పైలెట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఫ్లైట్ లో 177మంది ప్రయాణికులు, 7మంది సిబ్బంది ఉన్నారు. వారంతా సేఫ్ గా ఉన్నారు. వారందర్నీ సురక్షితంగా టెర్మినల్ భవనానికి తరలించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.

జాతీయమీడియా కథనం ప్రకారం…ఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న విమానం (6E-2131)లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగడంతో…ఫ్లైట్ లో కూర్చున్న ప్రయాణికులు కిటికీలో నుంచి ఇంజిన్ లో మంటలు రావడాన్ని గమనించి ఒక్కసారిగా షాక్ అయ్యారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో విమానాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇది జరిగినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10గంటలకు జరిగింది.