జమ్మూ-కశ్మీర్లో ఆర్మీ జవాన్లు (Army Soldiers) మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని 14 కి.మీ.మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు. ఖారీ ప్రాంతంలోని హర్గం అనే గ్రామంలో ఓ కుటుంబం, ఆ గ్రామ సర్పంచ్ నుంచి ఆర్మీకి (Army Soldiers) మెడికల్ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇచ్చారు.
మంచుతో రోడ్లు జారుడుగా ఉన్నాయి. దీంతో జవాన్లు (Army Soldiers) దాదాపు 6 అడుగులు ఉన్న మంచులో 6 గంటల పాటు శ్రమించి మహిళను 14 కి.మీ.స్ట్రెచర్పై మోసుకెళ్లారు. అంగారీ అనే గ్రామంలో మరో ఆర్మీ బృందం అంబులెన్స్ను (Ambulance) సిద్ధంగా ఉంచింది. దీంతో గర్భిణిని సురక్షితంగా బనిలాల్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి బంధువులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.