తెలంగాణ విద్యార్థులు బీసీ సంక్షేమ శాఖ, మహాత్మాజ్యోతిబా పూలే, బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద బీసీ, ఈబీసీ విద్యార్థులు ఆర్థిక సాయం పొందేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద విదేశాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడానికి అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విద్యా సంవత్సరానికి ఆగస్టు లేదా సెప్టెంబర్ సెషన్ కుక సంబంధించి అభ్యర్థులు నమోదు చేసుకునేందుకు తేదీ 01.09.2022న రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. చివరి తేది 30.09.2022న ముగుస్తుంది. ఇతర వివరాల కోసం ఆన్ లైన్ అప్లికేషన్స్ పొందేందుకు http://www.telanganaepass.cgg.gov.in అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించగలరని ఓ ప్రకటనలో తెలిపారు.
స్కాలర్ షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
దశ 1: అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా http://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను తెరవాలి.
దశ2: తర్వాత Overseas Scholarship Services అప్షన్ పై క్లిక్ చేయండి.
దశ 3: తర్వాత Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi for BC and EBC students విభాగంలో Registration అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
దశ 4: ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. వివరాలను నమోదు చేసి.. సూచించిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయండి.
దశ 5: తర్వాత నమోదు పై క్లిక్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి.