Travel : లాంగ్ వీకెండ్ ఇలా ప్లాన్ చేసుకోండి..అతి తక్కువ ధరలో బెంగుళూరు నుంచి బెస్ట్ ట్రిప్ ప్లాన్స్..!!

ఇంట్లో ఉండి బోర్ కొట్టిందా. ఎక్కడైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా. హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశాలకు అతితక్కువ ధరలో ట్రిప్ ప్లాన్ చేసుకోండి.. మీరు బెంగుళూరు నుండి 100 కి.మీ దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు మీ కుటుంబం లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - August 6, 2022 / 02:00 PM IST

ఇంట్లో ఉండి బోర్ కొట్టిందా. ఎక్కడైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా. హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశాలకు అతితక్కువ ధరలో ట్రిప్ ప్లాన్ చేసుకోండి.. మీరు బెంగుళూరు నుండి 100 కి.మీ దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు మీ కుటుంబం లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మాన్సూన్ లో ఈ ప్రదేశాలు చూడచక్కగా ఉంటాయి. మరి ఏయో ప్రదేశాలు చూడవచ్చో తెలుసుకుందాం.

శివనసముద్రం జలపాతం:
బెంగుళూరు నుండి శివనసముద్రం దాదాపు 138 కి.మీ. వారాంతంలో ప్రత్యేకంగా గడపడానికి శివనసముద్రానికి వెళ్లవచ్చు. వర్షాకాలంలో పొంగి ప్రవహించే ఈ జలపాతం అందాన్ని వర్ణించలేము. ఇక్కడ భరచుక్కి, గగనచుక్కి జలపాతాలు ఉన్నాయి. అవి మీ మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. . చుట్టుపక్కల పచ్చదనం స్వర్గాన్ని తలపిస్తుంది.

భీమేశ్వరి:
బెంగుళూరు నుండి 104 కి.మీ దూరంలో ఉన్న భీమేశ్వర్‌కు మీరు మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. ఇది మాండ్య జిల్లాలో ఉంది. ఇది మత్స్యకారులకు స్వర్గధామం అని చెప్పవచ్చు.
సాహస ప్రేమికులు వివిధ పక్షులను వీక్షించడం, పడవ ప్రయాణాలు, కొండ ట్రెక్‌లను ఎంచుకోవచ్చు.

సవనదుర్గ:
మీరు బెంగుళూరు నుండి 60 కి.మీ దూరంలో ఉన్న సావనదుర్గకు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి ఉంటే ఈ ప్రదేశం స్వర్గధామం. ఈ కొండ ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణంగా ప్రసిద్ధి చెందింది. కొండ దిగువన 2 అందమైన దేవాలయాలు ఉన్నాయి. సాహస ప్రియులు ట్రెక్కింగ్, క్యాంపింగ్ , రాక్ క్లైంబింగ్ వంటి అంతులేని ఉత్తేజకరమైన కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

తొట్టికల్లు జలపాతం:
ఈ తొట్టికల్లు జలపాతం బెంగుళూరు నుండి కేవలం 35 కి.మీ దూరంలో ఉంది. ఇది ఒక రోజు పర్యటనకు అనువైన ప్రదేశం. ఈ జలపాతాన్ని TK ఫాల్స్ అని కూడా అంటారు. జలపాతం సమీపంలో మునేశ్వర స్వామి ఆలయం ఉంది. వర్షాకాలంలో ఉప్పొంగి ప్రవహించే జలపాతం అందాలను చూడటం ఆనందంగా ఉంది. తొట్టికల్లు జలపాతాన్ని చూసిన తర్వాత, దారిలో బన్నెరఘట్ట నేషనల్ పార్క్‌ను సందర్శించండి.

నంది కొండ:
నంది బెట్ట బెంగుళూరు నుండి 58 కి.మీ దూరంలో ఉంది. బెంగుళూరు ప్రజల హాట్ ఫేవరెట్ టూరిస్ట్ డెస్టినేషన్. నంది బెట్టను మీరు కుటుంబంతో పిక్నిక్ కోసం ఎంచుకోవచ్చు. ఇక్కడ టిప్పు డ్రాప్, పురాతన దేవాలయం, టిప్పు సుల్తాన్ ప్యాలెస్‌లు వంటి చారిత్రక ప్రదేశాలను చూడవచ్చు.

మైసూర్ :
రెండు రోజుల పర్యటన కోసం బెంగళూరు నుండి 145 కి.మీ దూరంలో ఉన్న మైసూర్ సందర్శించండి. మైసూర్‌లో 3 రోజుల పాటు మైసూర్‌లోని ప్రదేశాలను చూడవచ్చు. మైసూర్ ప్యాలెస్, చాముండేశ్వరి ఆలయం, జూ, శ్రీరంగపట్నం, నిమిషాంబ దేవాలయం, మీ కుటుంబంతో పాటు మరిన్ని పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు.