Vasthu Tips: గుర్రం విగ్రహాలు ఇంట్లో పెడితే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా వాస్తు ప్రకారంగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలు కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల ఆర్థిక పరిస్థితులు

  • Written By:
  • Publish Date - November 16, 2022 / 06:30 AM IST

సాధారణంగా వాస్తు ప్రకారంగా ఇంట్లో కొన్ని రకాల మొక్కలు కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వడంతోపాటు ఇంట్లోవారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. మామూలుగా వాస్తు ప్రకారం సానుకూల ప్రతికూల శక్తి ఒక వ్యక్తి పురోగతి నుండి అతని ఆరోగ్య సంబంధం వరకు వర్తిస్తుంది. ఈ కారణంగానే ఇంట్లో కొన్ని రకాల వస్తువులను విగ్రహాలను ఉంచుతారు. అటువంటి కొన్ని విగ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే ఇంట్లో వాస్తు ప్రకారం గా ఎటువంటి విగ్రహాలు ఉంచాలో? వాటిని ఉంచడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. ఏనుగు ను సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. పడకగదిలో కూడా ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. అలాగే గుర్రపు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల విజయం బలం లభిస్తుంది. ఇంట్లో ఉత్తర దిశలో గుర్రపు విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారంలో ప్రతి రంగంలో కూడా విజయం లభిస్తుంది.

అలాగే హంస విగ్రహాలను ఇంట్లో పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక విగ్రహం పెట్టకూడదు ఒక జంట విగ్రహాలను మాత్రమే పెట్టుకోవాలి. హంస విగ్రహాలను ఇంట్లో నైరుతి దిశలో పెట్టుకోవడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే ఆవు దూడ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల పురోభివృద్ధి కలుగుతుంది. ఇత్తడితో చేసిన విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దాంతో పాటుగా పిల్లలు చదువులో కూడా ముందుకు రాణిస్తారు. అలాగే తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సంపద లభిస్తుంది. అంతే కాకుండా ఆ ఇంట్లో నివసించే వారి ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఈ తాబేలు విగ్రహాన్ని ఇంటికి తూర్పు లేదా ఉత్తర దశలో ఉంచడం మంచిది.