Pores On Face: ముఖం మీద గుంటలు ఏర్పడ్డాయా.. అయితే ఇలా చేయాల్సిందే?

మామూలుగా మానవులకు వయసు పెరిగే కొద్దీ చర్మ సమస్యలు పెరగడం అనేది సహజం. ముఖ్యంగా మొటిమల సమస్య తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉం

  • Written By:
  • Publish Date - August 20, 2023 / 09:40 PM IST

మామూలుగా మానవులకు వయసు పెరిగే కొద్దీ చర్మ సమస్యలు పెరగడం అనేది సహజం. ముఖ్యంగా మొటిమల సమస్య తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ మొటిమల వల్ల నల్లటి మచ్చలు గుంతలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖం మీద ఉండే చిన్న రంథ్రాలు క్రమేనా గుంతల్లా మారిపోతాయి. చర్మం మీద ఉండే చిన్న రంథ్రాలు విస్తరించినప్పుడు సేబాషియస్ గ్రంథి ఏర్పడుతుంది. ఇది చర్మాన్ని రక్షించేందుకు నూనె లను విడుదల చేస్తుంది. అయితే, కొంతకాలం తర్వాత ఆ నూనెలే చర్మానికి ప్రతికూలంగా మారతాయి. చిన్న రంథ్రాలను సాగదీస్తాయి. కొన్నాళ్ల తర్వాత అవి పెద్దవిగా మారి అందహీనంగా మరతాయి.

ఆ విధంగా ముఖంపై గుంతల సమస్యతో బాధపడేవారు కొన్ని రకాల చిట్కాలను పాటించడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖంపై ఉండే రంథ్రాలను దూరం చేయడానికి దోసకాయ బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సిలికా మీ చర్మానికి యవ్వనాన్ని అందించడమే కాకుండా పెద్ద రంథ్రాలను దగ్గరకు చేస్తాయి. వీటికి నిమ్మరసం చేర్చినట్లయితే మరింత మెరుగైన ఫలితాలను చూడవచ్చు. నిమ్మ కూడా గుంతలను మాయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి, ఆ రసాన్ని దూదితో ముఖానికి అద్ధి బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

అలాగే అరటి పండు తొక్క ముఖంపై రంథ్రాలను పూడ్చడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ పోషణకు సహకరిస్తాయి. అరటి తొక్కలో ఉండే పొటాషియం చర్మంపై మచ్చలను తొలగిస్తుంది. అరటి పండు తొక్కను మీ చర్మం మీద గుండ్రంగా రుద్దాలి. అలా సుమారు 15 నిమిషాలు వరకు రుద్ది,ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారంలో రెండుసార్లు చేస్తే చాలు. ముఖం మీద ఏర్పడిన పెద్ద రంథ్రాలు క్రమేనా మాయమవుతాయి. అదేవిధంగా ముల్తానీ మట్టి కేవలం మొటిమలనే కాదు. చర్మం మీద ఏర్పడే రంథ్రాలను సైతం మాయం చేస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను పీల్చుకుని పెద్ద రంథ్రాలు ఏర్పడకుండా కాపాడుతుంది.

చర్మంలోని మృత కణాలను సైతం తొలగిస్తుంది. వారానికి ఒకసారి ముల్తాని మట్టి రాస్తే రంథ్రాలు బిగువుగా మారతాయి. ముల్తానీ మట్టిని మీ ముఖాన్నికి బాగా రాసుకొని ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పసుపులోని సుగుణాలు గురించి మీకు తెలిసిందే. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు గల పసుపు గుంతల్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి ఒక టీ స్పూన్ పసుపుకు కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేసి, దాన్ని ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేస్తే చాలు.