Site icon HashtagU Telugu

Ayurveda Tips : మిగిలిపోయే అన్నం, కూరలను ఎన్ని గంటల్లోగా తినాలి ?

Ayurveda Tips

Ayurveda Tips

Ayurveda Tips : మనం రోజూ ఇంట్లో తిన్నాక మిగిలే ఆహారాన్ని దాచుకొని.. మరుసటి రోజు తింటుంటాం. అయితే ఇలా మిగిలిపోయిన అన్నాన్ని, కూరలను ఎన్ని గంటల్లోగా తినాలి ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. దీనికి  ఆయుర్వేదం ఇస్తున్న సమాధానం ఏమిటంటే.. ఆహారం తాజాదనం, రుచి ఎప్పటివరకైతే మారకుండా ఉంటుందో అప్పటివరకు దాన్ని తినొచ్చు. ఒకవేళ తాజాదనం, రుచి కనిపించని స్థితిలోకి ఆహార పదార్థాలు మారిపోతే, వాటిని తినడం డేంజర్. అలాంటి ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు ఆవరిస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆయుర్వేదం చెబుతున్న టిప్స్

ఉల్లిపాయ వేసిన కూరలు..

ప్రతి ఇంట్లో రోజూ రాత్రి సమయానికి కూరలు, పప్పులు మిగిలిపోతుంటాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టి తినేవాళ్లు ఉంటారు. కాకపోతే వాటిని ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు గాలి చొరబడని కంటైనర్లలో పెట్టి దాచాలి. ఇలా నిల్వ ఉంచాలని భావించే కూరల్లో ఉల్లిపాయలు వేయకుండా వండితే మంచిది. ఉల్లిపాయ వేసిన కూరలు త్వరగా పాడవుతాయి. నీళ్లు లేకుండా వండిన వేపుళ్లు మరుసటి రోజు వరకు దాచుకొని, వేడి చేసుకొని తిన్నా ఏమీ కాదు. బ్రెడ్‌ విషయానికి వస్తే ఫ్రిజ్‌లో పెట్టి వారం రోజుల వరకు వాడుకోవచ్చు. హోం మేడ్‌ బ్రెడ్‌ అయితే మూడు నాలుగు రోజుల వరకు(Ayurveda Tips) వాడొచ్చు.

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే. 

Also Read: Medigadda Bridge : మేడిగడ్డ వంతెన కుంగుబాటుపై కుట్ర, విద్రోహ చర్య కేసు