Travel : నార్త్ ఇండియాలో మీ పిల్లలతో కలిసి సందర్శించడానికి బెస్ట్ ట్రావెల్ ప్లేస్ లు

మీరు మీ పిల్లలకు (Children) భారతదేశంలోని (India) విభిన్న సంస్కృతిని చూపించాలనుకుంటే ఉత్తర

మీరు మీ పిల్లలకు (Children) భారతదేశంలోని (India) విభిన్న సంస్కృతిని చూపించాలనుకుంటే ఉత్తర భారతదేశంలోని (North India) అనేక పర్యాటక (Travel) ప్రదేశాలను (Places) సందర్శించవచ్చు. ఈ ప్రదేశాలు (Places) సౌకర్యాలతో నిండి ఉన్నాయి, అంతేకాకుండా ఇక్కడ మీరు చారిత్రక కట్టడాలు, పాత సంస్కృతి, జూ, మ్యూజియం మొదలైన వాటిని కూడా చూడవచ్చు. విశేషమేమిటంటే, ఈ ప్రదేశాలను అన్వేషించడానికి మీకు ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు. కాబట్టి ఈసారి శీతాకాలంలో (Winter) పిల్లలతో ఎక్కడికి వెళ్లవచ్చో (Travel) తెలుసుకుందాం.

వారణాసి (Varanasi):

 

వారణాసి అంటే కాశీ ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని చూసేందుకు విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ నగరాన్ని దేవాలయాల నగరం అని కూడా అంటారు. ఈ నగరం శంకర్ భగవానుడి త్రిశూలం మీద ఉందని చెబుతారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుని ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు కాశీ విశ్వనాథ్ ఆలయం, సంకట్ మోచన్ ఆలయం, తులసి మానస్ ఆలయం, దుర్గాకుండ్ ఆలయం, సారనాథ్, దశాశ్వమేధ ఘాట్, అస్సీ ఘాట్, మణికర్ణికా ఘాట్ మరియు BHU మొదలైన వాటిని సందర్శించవచ్చు.

మధుర (Madhura):

శ్రీ కృష్ణుడి జన్మస్థలమైన మధుర కూడా సందర్శించడానికి అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ వందలాది శ్రీ కృష్ణ దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ పిల్లలు చాలా ఆనందించవచ్చు. మీరు ఇక్కడ నుండి మధుర, బృందావనం కూడా సందర్శించవచ్చు. మధురలో.. ప్రేమ మందిర్, శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం, బాంకే బిహారీ ఆలయం, ద్వారకాధీష్ ఆలయం, రాధా కుండ్, కాన్సా ఫోర్ట్ మరియు గోవర్ధన్ కొండలను తప్పక సందర్శించాలి.

అయోధ్య (Ayodhya):

అయోధ్య.. శ్రీరాముని జన్మస్థలం. ఈ ప్రదేశం పిల్లలను తీసుకెళ్లడానికి కూడా మంచిది. రామమందిరంతో పాటు సరయు నది (భరత, లక్ష్మణ, శత్రుఘ్నలతో పాటు శ్రీరాముడు జలసమాధి తీసుకున్నాడు), శ్రీ రామ జన్మభూమి, హనుమాన్ గర్హి, దశరథ్ మహల్, కనక్ భవన్, రామ్ కి పౌరి, నాగేశ్వరనాథ్ ఆలయం, సీతాదేవి ఆలయంని చూడవచ్చు. రసోయి, తులసి స్మారక భవనం, రాజా దశరథ సమాధి స్థల్, మోతీ మహల్, బహు బేగం సమాధిని తప్పక సందర్శించాలి.

లక్నో (Lucknow):

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ పిల్లలు చాలా ఆనందించవచ్చు. ఇక్కడ అనేక పార్కులు ఉన్నాయి. వీటిని మీ పిల్లలు సందర్శించిన తర్వాత చాలా ఆనందిస్తారు. చారిత్రక ప్రదేశాలతో పాటు మీరు జూ, జామా మసీదు, భూల్ భులయ్య, బడా ఇమాంబారా, లా మార్టినియర్ స్కూల్, దిల్‌కుషా కోఠి, ఫిరంగి మహల్, బ్రిటిష్ రెసిడెన్సీ, లక్నో జూ, అంబేద్కర్ మెమోరియల్ పార్కులను తప్పక సందర్శించాలి.

నైనిటాల్ (Nainital):

ఉత్తరాఖండ్‌లోని అత్యంత అందమైన హిల్ స్టేషన్‌లలో ఒకటైన నైనిటాల్‌ను శీతాకాలంలో కూడా అన్వేషించవచ్చు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం మిమ్మల్ని ప్రతిసారీ ఇక్కడికి పిలుస్తుంది. మీరు ఇక్కడి సరస్సులలో పిల్లలతో పడవలో ప్రయాణించవచ్చు, నగరం చుట్టూ తిరుగుతూ ఆనందించవచ్చు. ఈ ప్రదేశం పిల్లలకు సాహసోపేతంగా ఉంటుంది.

ఢిల్లీ (Delhi):

ఢిల్లీ మొఘలుల గతాన్ని ప్రతిబింబించే చారిత్రాత్మక భవనాలతో నిండి ఉంది. ఢిల్లీలో మీరు ఎర్రకోట, కుతుబ్ మినార్, పాత కోట, సఫ్దర్‌గంజ్ సమాధి, హుమాయున్ సమాధి, జామా మసీదు, అక్షరధామ్ ఆలయం, బహాయి ఆలయం, జూ, జంతర్ మంతర్ మొదలైన వాటిని సందర్శించవచ్చు. ఇది కాకుండా, మీరు ఇక్కడ షాపింగ్ కూడా ఆనందించవచ్చు.

Also Read:  Sea Sand Snow : సముద్రం-ఇసుక-మంచు కలిసే ప్రదేశం గురించి తెలుసుకోవాలని ఉందా?