Weight Loss: ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే అలాంటి వారు రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే ఈజీగా ఆరోగ్యంగా బరువు తగ్గడం ఖాయం అని అంటున్నారు. మరి రాత్రి పూట ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది బరువు తగ్గడానికి ఏమేమో చేస్తుంటారు.
కానీ రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారట. అలాగే మీ పొట్ట కూడా ఫాస్ట్ గా తగ్గుతుందని చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ బరువు పెరగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని, అలాగే గుండె జబ్బులు కూడా రావచ్చట. ఎందుకంటే వీరి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయట. ఇది గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
అంతేకాదు బరువు ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుందట. దీంతో ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, స్లీప్ అప్నియా, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే బరువు ఎక్కువగా ఉంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందట. ఇది నెమ్మదిగా మీ లివర్ ను దెబ్బతీస్తుందని, అంతేకాదు శరీర బరువు ఎక్కువగా ఉంటే మన జీవితకాలం కూడా తగ్గుతుందట. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అయితే రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే చాలా మంది రాత్రిపూట చపాతీ తింటుంటారు. కానీ దీనికి బదులుగా మీరు రాగులతో చేసిన ఇడ్లీ లేదా దోశ, కూరగాయలతో చేసిన రాగి చపాతీని తినవచ్చట.
రాగుల్లో ఐరన్, ఫైబర్ లు ఎక్కువగా ఉంటాయి. రాగులతో చేసిన వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుందట. అలాగే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే రాగులతో చేసిన ఈ ఆహారాలను తినడం మంచిదని, దీని వల్ల ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు. కాగా రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబ్టటి రాగి చపాతీని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవట. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి రాగులు చాలా మంచివి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు రాగులతో చేసిన వాటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయట. ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. రాగుల్లో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది రక్తహీనత సమస్యను తగ్గించడానికి సహాయపడుతుందట. బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట మామూలు ఇడ్లీ తినడానికి బదులుగా మీరు ఓట్స్ తో చేసిన ఇడ్లీని తింటే మంచిదట. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఓట్స్లో ఉండే డైటరీ ఫైబర్ మీ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే మీరు బోజనం చేయకుండా నియంత్రిస్తుందట. ఓట్స్ లో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందట. అలాగే ఓట్స్ డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయట. అంతేకాదు ఓట్స్ ను తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బర, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయట. ఇలా చాలా సులువుగా జీర్ణం అవుతుందట. కాబట్టి వీటిని తినడం వల్ల కడుపునకు సంబంధించిన ఎలాంటి సమస్యలు రావని చెబుతున్నారు. పిండి పదార్థాలను ఎక్కువగా తింటే మీరు మరింత బరువు పెరుగుతారట. కాబట్టి మీరు ఇలాంటి ఆహారాలను తినకూడదనుకుంటే పోషకాలు పుష్కలంగా ఉన్న వెజిటేబుల్ సూప్ ను తాగడం మంచిదని, ఈ సూప్ చాలా తేలికగా జీర్ణం అవుతుందని, ఈ సూప్ లో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని దీనిలో తక్కువగా ఉండే బరువును తగ్గిస్తాయట.
