కివీ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కివీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కివీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుందట. ఇది శ్వాసకోశ వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు రక్తపోటు నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి కూడా కివిలు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండే కివి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కివీలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయట. కాగా కివీ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కివీ శరీర ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తుందట. కివీ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. కొల్లాజెన్ అనేది మన చర్మం స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడే సమ్మేళనం. కివీలో ఉండే విటమిన్ సి మీ చర్మంలో కొల్లాజెన్ సాంద్రతను పెంచుతుందట. కివీ ఫేస్ ప్యాక్స్ ముఖంపై నల్లటి మచ్చలను నివారించడానికి, మొటిమలను తగ్గించడానికి, మీ చర్మం అందంగా మెరిసేలా చేయడానికి సహాయపడతాయట.
బాగా పండిన కివి పండును గుజ్జుగా చేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. దీన్ని మీ ముఖం, మెడకు అప్లై చేయవచ్చు. దీన్ని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలట. ఈ ప్యాక్ ముఖంపై మచ్చలను నివారించడానికి, ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఒక గిన్నెలో ఒక కివీ గుజ్జును తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, అరటిపండు గుజ్జును వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి సమానంగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందట. ఒక కివీ పండు గుజ్జులో మూడు లేదా నాలుగు నానబెట్టిన బాదం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిని వేసి కలపాలట. దీన్ని ముఖం, మెడకు అప్లై చేయవచ్చట. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
ఇది మీ చర్మాన్ని టోన్ చేయడానికి, హైడ్రేట్ చేయడానికి, రంధ్రాలను నివారించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.
ఒక కివీ పండు పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి మీ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుందని చెబుతున్నారు. ఒక కివీ పండు పేస్ట్ లో ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని మిక్స్ చేసి ముఖానికి, మెడకు సమంగా అప్లై చేయాలి. దీన్ని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై రంధ్రాలు, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.