టెక్నాలజీ ప్రజల జీవితాలను సులభతరం చేసింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రతి మంచి విషయం వెనుక కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కన పెడితే, సాంకేతికత సామాన్యుల జీవితంలో కూడా ముడిపడి ఉంది. ఫలితంగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రజల పడక గదులకు చేరాయి. ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు, శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రోజంతా మనిషిని చురుకుగా ఉంచుతుంది. పగటి వెలుతురు తగ్గినప్పుడు, శరీరం మెలటోనిన్ అనే మరో హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది నిద్ర అనుభూతిని కలిగిస్తుంది.
అయితే మితిమీరి ఫోన్ వాడకం వల్ల గుడ్ ఫీల్సింగ్స్ ను మిస్ అవుతున్నామట. పెద్దలైనా, చిన్నపిల్లలైనా మొబల్ కారణంగా మంచి నిద్రకు దూరమవుతున్నారట. మీరు తరచుగా అర్థరాత్రి వరకు టీవీ లేదా స్మార్ట్ఫోన్ చూడటం అలవాటు చేసుకుంటే, ఈ అలవాటు మీ నిద్రను దెబ్బ తీస్తుంది. 2014లో నేషనల్ స్లీప్ ఫౌండేషన్ స్లీప్ ఇన్ అమెరికాలో ఒక సర్వే నిర్వహించింది. 89% పెద్దలు మరియు 75% మంది పిల్లలు తమ పడకగదులలో కనీసం ఒక ఎలక్ట్రానిక్ వాడుతున్నారని ఆ సర్వే అంచనా వేసింది.
సర్వేలో నిద్రవేళకు ముందు గంటలో 95% మంది పెద్దలు క్రమం తప్పకుండా టెక్, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. యువత ఎక్కువగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, వీడియో గేమ్లు ఆడుతున్నారు, వృద్ధులు ఎక్కువగా టీవీ చూస్తారని తెలిసింది. రాత్రిపూట తమ గదుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను కలిగి ఉన్న పిల్లలు అతి తక్కువగా నిద్ర పోతున్నారు. నియంత్రణ లేని స్క్రీన్ టైమ్, బెడ్రూమ్లోని టీవీ మొదలైనవి పిల్లలు అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే అలవాటును పెంచుతాయని పేర్కొంది. స్మార్ట్ ఫోన్ వల్ల భార్యభర్తల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని సర్వేలో స్పష్టమైంది. జీవితంలో సమతుల్యత సాధించాలంటే ప్రకృతితో ఒక గంట గడపాలి. ధ్యానం అవసరం. 24 గంటల్లో ఒక గంట శరీరానికి చాలా ముఖ్యం.
Also Read: Team India: ఆసియా కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!