Site icon HashtagU Telugu

Rajnath Singh : మీ సన్నద్ధతే దాయాదికి గట్టి హెచ్చరిక : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Your preparedness is a strong warning to your cousin: Defence Minister Rajnath Singh

Your preparedness is a strong warning to your cousin: Defence Minister Rajnath Singh

Rajnath Singh : భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక విమాన వాహక నౌక ఐఎన్ఎస్‌ విక్రాంత్‌ను శుక్రవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. నౌకలోని కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, అక్కడి అధికారులు, సైనికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో నౌకాదళం పాత్రపై ప్రసంగిస్తూ ఆపరేషన్‌ సిందూర్‌  గురించి ప్రస్తావించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంలో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. మన దేశం శక్తిమంతమైన ప్రతిస్పందనతో పాక్‌ను దిగమింగే స్థితికి తీసుకెళ్లింది. పాకిస్తాన్‌ స్వయంగా ఇతర దేశాల మద్దతును కోరాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మన దేశం, అంతర్జాతీయ ప్రమాణాల్ని పాటిస్తూ సైనిక చర్యలను స్వచ్ఛందంగా ఆపింది. ఆ ఆపరేషన్‌లో నౌకాదళం ప్రదర్శించిన దూకుడూ, వ్యూహాత్మకత అద్భుతమైనది అని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత వైమానిక దళం పాక్‌ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగా, అదే సమయంలో మన నౌకాదళం సముద్ర మార్గాన్ని పూర్తిగా నియంత్రించింది. పాక్‌ నౌకాదళానికి కదలికలే లేనివిధంగా, వారిపై మన దళాలు మోహరించాయి. మీ ముందస్తు ఏర్పాట్లు, ధైర్యవంతమైన సన్నద్ధతే పాకిస్తాన్‌ ధైర్యాన్ని చెదరగొట్టాయి. మీ చర్యలతో శత్రుదేశం గట్టిగా హెచ్చరికను పొందింది అని అధికారులకు ఆయన చెప్పారు.

Read Also: Bhairavam Movie Review: భైర‌వం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.!

ఆపరేషన్‌ సిందూర్‌ ముగిసిందనుకోవద్దు. ఇది కేవలం ఒక విరామం. పాక్‌ మరోసారి దుశ్చర్యకు ఒడిగట్టితే ఈసారి మన ప్రతిస్పందన మరింత తీవ్రంగా, కోలుకునే అవకాశం లేకుండా ఉండనుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో, పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ధాటిగా దాడులు జరిగాయి. ఈ దాడులు పాక్షికంగా కాకుండా వ్యూహాత్మకంగా జరిపినవి. ఈ క్రమంలో పాక్‌ ప్రతిస్పందనను ముందుగానే పసిగట్టిన భారత నౌకాదళం, తన నౌకాదళ శక్తిని పెంచేందుకు పలు కీలక చర్యలు తీసుకుంది. ఈ చర్యల్లో భాగంగా, కరాచీ పోర్టును లక్ష్యంగా చేసుకొని ఐఎన్ఎస్‌ విక్రాంత్‌తో పాటు బ్రహ్మోస్‌ క్షిపణులతో  యుద్ధ నౌకలు, జలాంతర్గాములను సముద్రంలో మోహరించారు. ఇది పాక్‌ నౌకాదళాన్ని పూర్తి స్థాయిలో గమనించకుండా చేశాయి. సముద్ర మార్గాల్లో భారత నావికాదళం చూపిన మోహరింపు సామర్థ్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్శన సందర్భంగా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు, భారత్‌ తన శత్రువుల పట్ల ఎంత సంకల్పబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందో స్పష్టం చేశాయి. నౌకాదళ శక్తిని ప్రదర్శించడంలో INS విక్రాంత్‌ మరోసారి కీలక మైలురాయిగా నిలిచింది.

Read Also: Child Marriage : పాకిస్తాన్‌లో బాల్య వివాహాల రద్దు బిల్లు..అధ్యక్షుడు జర్దారీ ఆమోదం