Site icon HashtagU Telugu

Gyanesh Kumar : కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేశ్‌ కుమార్‌.. నేపథ్యమిదీ

Gyanesh Kumar New Chief Election Commissioner Article 370 Abrogation constitution Jammu And Kashmir 

Gyanesh Kumar : జ్ఞానేశ్‌ కుమార్.. భారత ఎన్నికల సంఘం నూతన సారథి ఈయనే.  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఈయనను  ప్రధాని మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఎంపిక చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా సభ్యులుగా ఉన్నారు.  ఈ కమిటీ సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం జరిగిన తొలి నియామకం ఇదే. కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించడంపై అభ్యంతరాలు తెలుపుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల(ఫిబ్రవరి) 19న విచారణ జరగనుంది. అందుకే సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు కొత్త సీఈసీ ఎంపికపై నిర్ణయాన్ని వాయిదావేయాలని త్రిసభ్య కమిటీ సమావేశంలో రాహుల్‌ గాంధీ సూచన చేశారని సమాచారం.

Also Read :Aircraft Crashed : ల్యాండ్ కాగానే విమానం బోల్తా.. 18 మందికి గాయాలు

ఈరోజుతో ముగియనున్న పదవీకాలం

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం ఈరోజు(మంగళవారం)తో ముగుస్తుంది. అందుకే సోమవారం సాయంత్రం నూతన సీఈసీని ఎంపిక చేశారు. రాజీవ్‌ కుమార్‌ తర్వాత సీనియర్‌ అయిన జ్ఞానేశ్‌ కుమార్‌ను(Gyanesh Kumar) సీఈసీ పదవికి ఎంపిక చేశారు.  ఇప్పటివరకు ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ సేవలు అందించారు.  జ్ఞానేశ్‌ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషిని నియమించారు. సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఇప్పటికే మరో ఈసీగా ఉన్నారు.

Also Read :TTD : ముంబైలో పద్మావతి అమ్మవారి ఆలయం కోసం భూమి కేటాయింపునకు టీటీడీ అభ్యర్థన

జ్ఞానేశ్‌ ఎవరు ?