Weather Alert: తీవ్ర తుపానుగా బిపార్జోయ్​.. అలర్ట్​ జారీ చేసిన వాతావరణశాఖ

అరేబియా సముద్రంలో తలెత్తుతున్న 'అత్యంత తీవ్ర' తుపాను 'బిపార్జోయ్' వేగం మరో మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ తుఫాను వాయువ్య-వాయువ్య దిశగా కదులుతున్నందున భారత తీరానికి దూరంగా ఉంటుంది.

  • Written By:
  • Updated On - June 9, 2023 / 10:06 AM IST

Weather Alert: అరేబియా సముద్రంలో తలెత్తుతున్న ‘అత్యంత తీవ్ర’ తుపాను ‘బిపార్జోయ్’ వేగం మరో మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ తుఫాను వాయువ్య-వాయువ్య దిశగా కదులుతున్నందున భారత తీరానికి దూరంగా ఉంటుంది. వేడెక్కుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కారణంగా శక్తివంతమైన తుఫానులు తరచుగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. సీనియర్ శాస్త్రవేత్త, పూణే IMD అధిపతి డాక్టర్ KS హోసలికర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలోని తీర ప్రాంతాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని మేము ఆశించడం లేదు. తుపాను తీరం నుంచి ఉత్తరం, వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని తాజా అంచనాలు చెబుతున్నాయని అన్నారు.

సైక్లోన్ బిపార్జోయ్ కారణంగా, జూన్ 10, 11, 12 తేదీల్లో గాలి వేగం 45 నుండి 55 నాట్ల వరకు వెళ్లవచ్చు. గాలి వేగం 65 నాట్ల మార్కును కూడా తాకవచ్చు. తుఫాను కారణంగా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర సహా తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని ఐఎండీ వాతావరణ కేంద్రం డైరెక్టర్ మనోరమా మొహంతి మాట్లాడుతూ రిమోట్ హెచ్చరిక సంకేతాలను ఎగురవేయాలని అన్ని ఓడరేవులను కోరినట్లు చెప్పారు.

Also Read: Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంలో 3 రైళ్లు ధ్వంసం.. ఆ రైళ్ల నిర్మాణానికి ఎంత డబ్బు ఖర్చవుతుందో తెలుసా..?

బిపార్జోయ్ తుఫాను రానున్న 36 గంటల్లో మరింత తీవ్రమవుతుంది. దీంతో గుజరాత్ మత్స్యకారులను తిరిగి తీరానికి పిలిచారు. తుఫాను వల్ల భారత్, ఒమన్, ఇరాన్, పాకిస్థాన్ సహా అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న దేశాలపై ఇంతవరకు పెద్దగా ప్రభావం ఉండదని ఐఎండీ పేర్కొంది. జామ్‌నగర్ కలెక్టర్ బీఏ షా మాట్లాడుతూ.. జిల్లాలోని సముద్ర తీరంలో ఉన్న 22 గ్రామాల్లో సుమారు 76 వేల మందిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పెద్దపీట వేసినట్లు తెలిపారు.

సైక్లోన్ ను ట్రాక్ చేస్తున్న శాస్త్రవేత్తలు గురువారం మధ్యాహ్నం వరకు గోవాకు పశ్చిమ-నైరుతి దిశలో 850 కి.మీ, ముంబైకి నైరుతి-890 కి.మీ, పోర్‌బందర్‌కు నైరుతి-నైరుతి దిశలో 900 కి.మీ దూరంలో ఉన్నట్లు తెలిపారు. ఇది గత కొన్ని గంటల్లో ఉత్తర దిశగా కదిలింది. బైపర్‌జోయ్ తుఫాను వచ్చే 24 గంటల్లో క్రమంగా తీవ్రతరం అవుతుందని, రానున్న మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. తుఫాను దేశం పశ్చిమ తీరానికి అనేక వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదిలావుండగా గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో అప్రమత్తంగా ఉంచారు. సముద్రంలో తుపాను ఉందని, అందువల్ల జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిలిపివేయాలని కోరారు.