Site icon HashtagU Telugu

Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Lord Ram Statue

Lord Ram Statue

Lord Ram Statue: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దక్షిణ గోవాలోని చారిత్రక శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని (Lord Ram Statue) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం 77 అడుగుల ఎత్తు ఉంది. దీనిని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ కాంస్యంతో రూపొందించారు.

గోవాలో ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ అయోధ్యలోని రామమందిరంపై పవిత్ర జెండా ఎగురవేసిన కొద్ది రోజులకే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం లభించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

మఠం గొప్పతనంపై ప్రధాని ప్రశంస

ప్రతిమను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం 550 సంవత్సరాల ఘనమైన చరిత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సంస్థ ఎన్నో తుఫానులను, సవాళ్లను ఎదుర్కొందని తెలుసుకోవడం చాలా గర్వకారణమని అన్నారు.

Also Read: Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

శ్రీరాముని ప్రతిమ ప్రత్యేకతలు

Exit mobile version