Site icon HashtagU Telugu

Accident At UP Highway: పొగమంచులో ప్రమాదం.. రాత్రంతా మృతదేహం పైనుంచే వాహనాలు

Suicide

Deadbody Imresizer

సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే (Highway)పై కీతం సమీపంలో కొత్త సంవత్సరం మొదటి రోజున షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఓ ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడి మృతదేహం (Dead Body) పైనుంచి రాత్రంతా ప్రయాణించారు. దీంతో మృతదేహం రోడ్డుపై చెల్లాచెదురుగా పడింది. సోమవారం తెల్లవారుజామున హైవేపై మృతదేహం ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురుగా పడి ఉండడంతో దారిన వెళ్లేవారు చూశారు. ప్రమాదంపై వారు పోలీసులకు సమాచారం అందించారు.

కీతం సమీపంలో నూతన సంవత్సరం రోజున గుర్తుతెలియని వాహనం ఢీకొని పాదచారి మృతి చెందాడు. అతని మృతదేహం మధుర నుంచి ఆగ్రా వచ్చే రహదారిపై పడి ఉంది. ఈ క్రమంలో మధుర నుంచి వస్తున్న చిన్న, పెద్ద వాహనాలు రాత్రంతా మృతదేహాన్ని తొక్కివేస్తూనే ఉన్నాయి. సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దాబాల వద్ద పనిచేస్తున్న కొందరు వ్యక్తులు అక్కడి నుంచి బయటకు వచ్చి చూడగా మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి ఉంది.

Also Read: 63 Russian Soldiers: క్షిపణులతో దాడి.. 63 మంది రష్యా సైనికులు దుర్మరణం

మృతుడి శరీరంపై వేసిన దుస్తులు కూడా రోడ్డుకు అంటుకున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపై పడి ఉన్న మృతదేహం డ్రైవర్లకు కనిపించలేదు. నివేదికల ప్రకారం మృతదేహం ముక్కలను చూస్తే మృతుడు మగవాడని భావిస్తున్నారు. మృతుడు మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లా మొరెనా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, ఘటనపై అతని బంధువులకు సమాచారం అందించామని స్టేషన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్ షాహి తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.