Vande Bharat Express: చక్రాల వద్ద సాంకేతిక లోపం.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)లు ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా యూపీలో కౌశాంబీ జిల్లాలో వందేభారత్ ట్రైన్ (Vande Bharat Express) చక్రాల వద్ద వింత శబ్దం రావడంతో వెంటనే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశాడు. చక్రాల మధ్యలో లోహపు వస్తువు ఇరుక్కుపోవడంతోనే శబ్దం వచ్చినట్లు గుర్తించి దానిని తొలగించారు. దాదాపు గంట సమయం తర్వాత ట్రైన్ తిరిగి బయల్దేరింది. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను […]

Published By: HashtagU Telugu Desk
Vande Bharat Express

Jpg (1)

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)లు ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా యూపీలో కౌశాంబీ జిల్లాలో వందేభారత్ ట్రైన్ (Vande Bharat Express) చక్రాల వద్ద వింత శబ్దం రావడంతో వెంటనే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశాడు. చక్రాల మధ్యలో లోహపు వస్తువు ఇరుక్కుపోవడంతోనే శబ్దం వచ్చినట్లు గుర్తించి దానిని తొలగించారు. దాదాపు గంట సమయం తర్వాత ట్రైన్ తిరిగి బయల్దేరింది.

ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను స్థానిక మున్సిపాలిటీ భర్వారీ పట్టణంలోని భర్వారీ రైల్వే స్టేషన్‌లో అకస్మాత్తుగా నిలిపివేయడం కలకలం సృష్టించింది. రైలు ఆగిన వెంటనే ప్రయాణికులు భయాందోళనకు గురై తలుపులు తెరిచి బయటకు చూడటం ప్రారంభించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఉద్యోగులు అక్కడికి చేరుకుని రైలు గురించి ఆరా తీశారు. సాంకేతిక లోపం కారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు గంటపాటు భర్వారీ వద్ద నిలిచిపోయింది. రైలు డ్రైవర్, గార్డు సాంకేతిక లోపాన్ని సరిచేసి రైలును పంపించారు.

న్యూ ఢిల్లీ నుండి వారణాసికి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నంబర్ 22436 మధ్యాహ్నం 12.25 గంటలకు భర్వారీ రైల్వే స్టేషన్‌లో ఆగింది. రైలు ఒక్కసారిగా ఆగడంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. రైలు ఆగిన వెంటనే రైల్వే ఉద్యోగులతో పాటు పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది.

Also Read: Cyclone Mandous: తీవ్రతుపానుగానే మాండూస్‌.. పలు జిల్లాల్లో అలెర్ట్‌

రైలు డ్రైవర్, గార్డు స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ లూప్ లైన్‌లో రైలును నిలిపి తనిఖీ చేయగా ఇంజిన్ చక్రంలో సాంకేతిక లోపం కనిపించింది. రైలు డ్రైవర్, గార్డు దాదాపు అరగంట పాటు శ్రమించి దాన్ని సరిదిద్దారు. రైలు 1:08కి బయలుదేరింది. ఈ సమయంలో అన్ని రైళ్లను మెయిన్ లైన్ నుంచి పంపించారు. దీని వల్ల మరే ఇతర రైలుకు ఇబ్బంది కలగలేదు.ఈ విషయమై PRO ప్రయాగ్‌రాజ్ మండల్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ.. వందేభారత్ రైలులో ఇంజిన్ కోచ్ చక్రంలో సాంకేతిక లోపం కారణంగా రైలు 42 నిమిషాల పాటు భర్వారీ రైల్వే స్టేషన్‌లో నిలిపినట్లు తెలిపారు.

  Last Updated: 10 Dec 2022, 05:58 AM IST