Vande Bharat Express: బీహార్ ప్రయాణికులకు శుభవార్త. ప్రభుత్వం మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలును నడపబోతోంది. ఈ రైలు పాట్నా నుండి హౌరా మార్గంలో నడుస్తుంది. ఈ నెల నుంచి ఈ సెమీ హైస్పీడ్ రైలు నడపనున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపడానికి రైల్వే పూర్తిగా సిద్ధమైంది. ఇది ఎప్పుడు పనిచేస్తుందనే దానిపై ధృవీకరించబడిన తేదీ వెల్లడించనప్పటికీ, ఇది ఆగష్టు నెల రెండవ వారంలో ప్రారంభించవచ్చని అధికారులు చెబుతున్నారు.
పాట్నా నుండి హౌరాకు వందే భారత్ రైలు
బీహార్కు ఇది రెండవ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు జూన్ 27న పాట్నా నుండి రాంచీకి ప్రారంభమైంది. పాట్నా నుంచి హౌరా వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తూర్పు మధ్య రైల్వే అధికారి తెలిపారు. ఈ మేరకు రైల్వే అధికారుల మధ్య సమావేశం జరిగింది.
Also Read: 2019 Elections: 2019 ఎన్నికల్లో బీజేపీ కుట్ర: మెక్ క్రారి టెస్ట్ తేల్చివేత
గ్రౌండ్ లెవల్ పనులు
రైల్వే శాఖ తరపున ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపడానికి గ్రౌండ్ లెవల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దానాపూర్ సెక్షన్లోని సీనియర్ రైల్వే అధికారి ప్రకారం.. ఈ రైలును పాట్నా-హౌరా మార్గంలో నడపడానికి రైల్వే సమయం, ఛార్జీలపై కసరత్తు చేస్తోంది. ECR, తూర్పు రైల్వే రెండింటి మధ్య రైల్వే ట్రాక్లను బలోపేతం చేసే పని జరుగుతోంది.
ఎంత వేగం, ఎంత దూరాన్ని కవర్ చేస్తుంది
ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు 90 kmph నుండి 110 kmph వరకు సాధారణ వేగంతో నడుస్తుంది. ఇది మొత్తం 535 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు ఏడు గంటల్లో అధిగమించగలదు. వందే భారత్ గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు.
ఛార్జీ ఎంత ఉంటుంది..?
పాట్నా- హౌరా రూట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఛార్జీని నిర్ణయించలేదని భారతీయ రైల్వే అధికారి తెలిపారు. ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాస్కు ఒక్కో ప్రయాణికుడికి రూ. 2,650, ఏసీ చైర్ కార్కు రూ. 1,450 చెల్లించవచ్చు. ఇందులో ఆహారం, అల్పాహారం కూడా ఉన్నాయి. అయితే రైలు నిలిపివేతపై రైల్వేశాఖ ఇంకా కసరత్తు చేయలేదు.