Indus Waters Treaty : పహల్గాం ఉగ్రదాడికి గట్టిగానే బదులు చెప్పింది భారత్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు వ్యూహాత్మకంగా షాక్ ఇచ్చింది. సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలును నిలిపివేసి పాకిస్థాన్కు షాక్ ఇచ్చింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం రాజ్యసభలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘నీరు, రక్తం కలిసి ప్రవహించవు’’ అంటూ మరోసారి తేల్చిచెప్పిన ఆయన, పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టే వరకూ ఈ ఒప్పందం అమలు ఉండదని స్పష్టం చేశారు.
ఒప్పందం కంటే ఉగ్రవాదం ప్రాధాన్యమా?
1960లో భారత్, పాకిస్థాన్ల మధ్య జలాల పంపకంపై ఒక చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీనిని ‘ఇండస్ వాటర్స్ ట్రిటీ’గా పిలుస్తారు. దీనిలో భాగంగా, సింధూ నది సహా జీలం, చీనాబ్ అనే పశ్చిమ నదులపై ప్రధాన హక్కులు పాకిస్థాన్కు అప్పగించబడ్డాయి. కానీ, పాకిస్థాన్ అదే ఒప్పందాన్ని సాయం పొందేందుకు ఉపయోగించుకుంటూ, మరోవైపు ఉగ్రవాదానికి అండగా నిలుస్తోందన్న విమర్శలు గతంలో నుంచే వచ్చాయి. ఇటీవల జమ్మూ కశ్మీర్లో పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది.
ఆపరేషన్ సిందూర్ – ఉగ్రవాదంపై భారత ముద్ర
పహల్గాం దాడికి తక్షణం స్పందనగా భారత్ “ఆపరేషన్ సిందూర్” చేపట్టి ఉగ్రవాద సంస్థలపై ప్రతీకార దాడులు జరిపింది. ఈ చర్యలతో పాటు, అంతర్జాతీయంగా కూడా దాయాది దేశాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు ఢిల్లీ కార్యచరణ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో తొలిసారిగా “ది రెసిస్టెన్స్ ఫ్రంట్” అనే ఉగ్ర సంస్థను ప్రస్తావించడం గమనార్హం. ఇది భారత్ ప్రయత్నాల ఫలితమేనని జైశంకర్ వెల్లడించారు.
నీటి ఆధారంగా వ్యవసాయం చేసే పాక్కు భారీ దెబ్బ
పాకిస్థాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సింధూ నదులపై ఆధారపడింది. పాకిస్థాన్ వ్యవసాయానికి ఉపయోగించే నీటిలో 80 శాతం ఈ ఒప్పందం ద్వారా లభించేది. అంతేకాదు, దేశ GDPలో 25 శాతం ఈ నదుల పైనే ఆధారపడి ఉంది. అటువంటి కీలక వనరులపై భారత్ నియంత్రణ పెంచడమంటే, పాక్ భవిష్యత్తు ముసురుకపోవడం ఖాయం.
వియన్నా ఒప్పందం భారత్కు వర్తించదు
సింధూ ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు భారత్కు ఉందని స్తిరంగా చెప్పొచ్చు. అంతర్జాతీయ ఒప్పందాలపై నియమాలను నిర్దేశించే వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. అందువల్ల పాక్ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా, తాము అనుకూల తీర్పు తెచ్చుకున్నా, అది భారత్పై అమలులోకి రావడం అసాధ్యం. భారత్కు ఏ ఒప్పందాన్నైనా తిరిగి పరిశీలించుకునే సార్వభౌమాధికారం ఉంది.
మోదీ పాలనలో వైఖరికి మార్పు
పూర్వ కాంగ్రెస్ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఈ సందర్భంగా జైశంకర్ విమర్శలు గుప్పించారు. భారత రైతుల కంటే పాకిస్థాన్ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం ఆ దోషాలను సరిదిద్దుతోంది. ఆర్టికల్ 370 రద్దు అయినట్టు ఇప్పుడు సింధూ ఒప్పందాన్ని కూడా తిరిగి పరిశీలిస్తున్నాం అన్నారు. భారత్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం వాటర్ డిప్లోమసీ కాదు, ఇది సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో ఒక కీలకమైన చర్య. ఉగ్రవాదానికి పాల్పడే దేశాలకు నీరు ఇవ్వకూడదన్న సిద్ధాంతాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోంది. ఇది ప్రపంచ దేశాలకు కూడా బలమైన సందేశం.
Read Also: Al Qaeda : బెంగళూరులో అల్ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్మైన్డ్ అరెస్ట్