Site icon HashtagU Telugu

Women’s Reservation Bill : మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

Delimitation

Pm Modi Parliament

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కీలక క్యాబినెట్ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే కేబినెట్ సమావేశం తర్వాత ప్రభుత్వం స‌మావేశం గురించి మీడియాకు వెల్ల‌డిస్తుంది, అయితే ఈ సారి మీడియాకు వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో ఇంకా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తొలి సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటలకు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పిస్తామని బిల్లు హామీ ఇచ్చింది. ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టాలని పార్టీల‌క‌తీతంగా పలువురు నేతలు డిమాండ్ చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ప్రకటించినప్పటి నుండి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు తమ పార్టీ చిరకాల డిమాండ్ అని కాంగ్రెస్ పేర్కొంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్వాగతించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు హాజరయ్యారు.

 

Exit mobile version