Union Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? సర్వే ఎలా సిద్ధం చేస్తారు?

కేంద్ర ఆర్థిక మంత్రి 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది ఎన్నికల తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సమర్పిస్తారు

Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది ఎన్నికల తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. ఆర్థిక సర్వే అంటే ఏంటి?, ఎందుకు సర్వే చేస్తారు? చూద్దాం.

మోదీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టనుంది. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు . ఈ ఏడాది ఎన్నికలు జరగనుండగా ఎన్నికల అనంతరం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ఒకరోజు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను అందజేస్తారు. అయితే బడ్జెట్‌ను అర్థం చేసుకునే ముందు ఆర్థిక నిబంధనలు కూడా తెలియాల్సి ఉంటుంది.

ఆర్థిక సర్వే అంటే ఏమిటి?
దేశ ఆర్థిక సర్వే ఒక ముఖ్యమైన పత్రం. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ఒకరోజు ముందు దీనిని సమర్పిస్తారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థను సమీక్షిస్తారు. అంతే కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల సారాంశాన్ని కూడా ఇందులో ప్రదర్శించారు. ఇది ప్రభుత్వ విధాన కార్యక్రమాలను హైలైట్ చేస్తుంది.

మొదటి ఆర్థిక సర్వే 1950-51 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. బడ్జెట్‌తో పాటు దీనిని సమర్పించారు. 1964 తర్వాత ఇది బడ్జెట్ నుండి వేరు చేయబడింది. అప్పటి నుండి దీనిని బడ్జెట్‌కు ఒక రోజు ముందు సమర్పిస్తూ వస్తున్నారు.

ఆర్థిక సర్వే ఎందుకు ?
ఆర్థిక సర్వే ముఖ్యమైనది ఎందుకంటే అందులో వ్యవసాయం, సేవలు, పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాలు వంటి ఇతర రంగాల పనితీరును ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ రంగాల ఆర్థిక విశ్లేషణలో ఇది సహాయపడుతుంది.ఇది కాకుండా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యూహాన్ని రూపొందించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ సర్వే ద్వారా ఆర్థికాభివృద్ధిలో అవరోధాలను తెలుసుకోవచ్చు.

ఆర్థిక సర్వే ఎలా సిద్ధం చేస్తారు?
ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు ఆర్థిక సర్వేను తయారు చేస్తారు. వారిని ప్రధానమంత్రి నియమిస్తారు. ప్రస్తుతం దేశ ప్రధాన ఆర్థిక సలహాదారుగా డాక్టర్ వి. అనంత్ నాగేశ్వరన్ ఉన్నారు. అయితే ఆర్థిక సర్వేను తెలుసుకోవాలని అనుకుంటే ‘www.indiabudget.gov.in/economicsurvey వెబ్ ని సందర్శించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా పార్లమెంటులో సమర్పించిన తర్వాతే ఇది పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.

Also Read: Budget 2024 : ఈసారి బడ్జెట్ లోనైనా సామాన్యుడి కోర్కెలు తీరుతాయో..?