World Cup: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత, పశ్చిమ బెంగాల్లోని బంకురా, ఒడిశాలోని జాజ్పూర్కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు తీసుకున్నారు. 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం కోట్లాది మంది అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ ఓటమి చాలా మంది భారత అభిమానులను బాధించింది. భారత్ ఓటమి తర్వాత, రాహుల్ లోహర్ (23) ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బంకురాలోని బెలిటోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
భారత్ ఓటమి తర్వాత రాహుల్ తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని రాహుల్ బావ ఉత్తమ్ సూర్ తెలిపారు. అతని మృతదేహాన్ని సోమవారం ఉదయం పోస్ట్మార్టం నిమిత్తం బంకురా సమ్మిలాని మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను పోలీసులు అసహజ మరణంగా నమోదు చేశారు. ఒడిశాలోని జాజ్పూర్లో ఆదివారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత దేవ్ రంజన్ దాస్ (23) మృతదేహం బింజర్పూర్ ప్రాంతంలోని అతని ఇంటి టెర్రస్కు వేలాడుతూ కనిపించింది. ఈ రెండు ఘటనలు ఆలస్యంగా వెలుగుచూశాయి.