Site icon HashtagU Telugu

The Sabarmati Report : ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీని మెచ్చుకుంటూ మోడీ ఏమన్నారంటే..

The Sabarmati Report Godhra Tragedy Pm Modi Godhra Train Burning Bjp

The Sabarmati Report : నవంబరు 15న విడుదలైన ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఈ సినిమాలో నిజాలను చక్కగా చూపించారని ఆయన కొనియాడారు. నిజానిజాలు సామాన్య ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైనా సినిమా నిజాలను చూపిస్తున్నప్పుడు..  చుట్టూ ఎన్ని వివాదాలు ముసురుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోడీ పేర్కొన్నారు. తప్పుడు అభిప్రాయాలు తక్కువ కాలం పాటే మనుగడలో ఉంటాయని.. వాటిని పట్టించుకోకుండా దీక్షతో ముందుకు సాగాలన్నారు.

ఎక్స్ యూజర్ పోస్టుకు స్పందిస్తూ..

‘‘2002 సంవత్సరంలో జరిగిన గోద్రా విషాదం వెనుక దాగిన సత్యాలను ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report) చక్కగా చూపించింది. సినిమా టీమ్ ఇందుకోసం అద్భుతంగా పనిచేసింది. ఆనాడు జరిగిన ఘటనల్లో 59 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు’’ అని పేర్కొంటూ ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు స్పందిస్తూ ప్రధాని మోడీ పై వ్యాఖ్యలు చేశారు.  ఈ సినిమాలో విక్రాంత్ మస్సీ, రాశీ ఖన్నా, రిద్ధీ డోగ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను విడుదల చేసే క్రమంలో చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. అనుమతులు లభించడంలో జాప్యం జరిగింది. వీటన్నింటిని అధిగమించి ఈనెల 15న సినిమా విడుదలైంది. ఈ మూవీకి ధీరజ్ సర్నా డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Also Read :BJP WhatsApp Head : బీజేపీ ముందడుగు.. వాట్సాప్ హెడ్‌‌ నియామకం.. ఎందుకంటే ?

గోద్రా రైలు ఉదంతం ఏమిటది ?