ఘజియాబాద్లో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు చిన్నారులు సోసైటీ లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ చిన్నారులు 20 నుంచి 25 నిమిషాల పాటు అందులోనే ఉండిపోయారు. ప్రాణభయంతో వణికిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసోటెక్ నెస్ట్ సొసైటీ ఆఫ్ క్రాసింగ్ రిపబ్లిక్ లిఫ్ట్ అకస్మాత్తుగా చెడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అమ్మాయిలు లిఫ్ట్లో చిక్కుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లిఫ్ట్లో చిక్కుకున్న బాలికలు భయాందోళనకు గురవడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. చాలా సేపు లిఫ్ట్ తెరవడానికి ప్రయత్నించినా లిఫ్ట్ తెరుచుకోలేదు. వారు ఎమర్జెన్సీ కాల్ బటన్ను నొక్కినా తక్షణ సహాయం పొందలేకపోయారు. సీసీ టీవీ వీడియోలో అమ్మాయిలు లిఫ్ట్ డోర్ను బలవంతంగా తెరవడానికి ప్రయత్నించడం, సహాయం కోసం కాల్ చేయడానికి లిఫ్ట్లోని బటన్లను నొక్కడం, ఒకరినొకరు ఓదార్చడానికి ప్రయత్నించడం చూడవచ్చు. వారు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఏడవడాన్ని గమనించవచ్చు.
అందిన సమాచారం ప్రకారం.. ఈ సంఘటన నవంబర్ 29న సాయంత్రం జరిగినట్లు సమాచారం. బాలికల తల్లిదండ్రులు సొసైటీ మెయింటెనెన్స్ కంపెనీ ఆఫీస్ బేరర్లపై కేసు పెట్టారు. అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. లిఫ్ట్ నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు.లిఫ్ట్ నిర్వహణకు ఏటా 25 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని బాలికల తల్లిదండ్రులు చెప్పారు. తరచుగా సొసైటీ లిఫ్ట్లలో ప్రజలు చిక్కుకుపోతున్నారని, ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని వారు చెబుతున్నారు.
@JEscalators को सालाना एएमसी के बावबूज़ आये दिन कोई ना कोई हादसा एसोटेक नेस्ट,क्रॉसिंग रिपब्लिक में होता हैं,इस वर्ष 27लाख़ खर्च करने के बाद भी मेरी बेटी व उसकी दोस्त लिफ्ट में 24मिनट फसे रहे,तीनों बच्चे हद से ज़्यादा भयभीत हैं व एओएए कोई जवाब नहीं हैं@Uppolice @ghaziabadpolice pic.twitter.com/WHPwV9k0h7
— ठा. शिवम गहलोत (@shivamgahlot) December 1, 2022