Site icon HashtagU Telugu

Weather Updates: మారిన వాతావరణం.. మూడు రోజులు భారీ వర్షాలు..

Rains

Rains

Weather Updates: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ తీవ్ర ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలు ఉన్నప్పటికీ, గత రెండు-మూడు రోజుల నుంచి తెలంగాణలో భానుడు సెగలు కక్కుతున్నాడు. అయితే.. ఉదయం వేళల్లో గాలి వేడిగా ఉంటుంది, కానీ సాయంత్రానికి వాతావరణం అచ్చంగా చల్లబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు కూడా వీస్తున్నాయి.

వీటితో పాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా మరోసారి హెచ్చరికలు విడుదల చేసింది. రాబోయే మూడు రోజులలో తెలంగాణలో వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించడంతో, ఈ గాలి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీంతో ఆ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.

యాదాద్రి, జనగామ, ములుగు, భద్రాద్రి కృష్ణ, మహాబూబాబాద్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశముందని సమాచారం వచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితులు తప్ప మరింతగా బయటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ సలహా ఇచ్చింది.

Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్‌ మృతి..!