Site icon HashtagU Telugu

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

Rahul Gandhi

Resizeimagesize (1280 X 720) (5)

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు (Surat Court) నుంచి ఉపశమనం లభించలేదు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అతని శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సూరత్‌లోని సెషన్స్ కోర్టు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యకు క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించి, అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ఇప్పుడు సెషన్స్ కోర్టు నుంచి కూడా రాహుల్ గాంధీకి నిరాశే ఎదురైంది. అందిన సమాచారం ప్రకారం.. దిగువ కోర్టు నిర్ణయాన్ని సెషన్స్‌ కోర్టు సమర్థించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించవచ్చు.

మోదీ ఇంటిపేరుపై 2019లో చేసిన వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు సెక్షన్ 504 కింద మార్చి 23న సూరత్ సీజేఎం కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. అయితే, నిర్ణయాన్ని అమలు చేయడానికి కోర్టు 30 రోజుల సమయం కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ ‘దొంగలందరికీ మోడీ ఇంటిపేరు ఎలా వచ్చింది?’ ఈ మేరకు రాహుల్ గాంధీపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ పరువునష్టం కేసు వేశారు.

Also Read: Anti-Hindu Schools: బ్రిటన్‌ పాఠశాలల్లో హిందూ విద్యార్థులపై వివక్ష.. వెలుగులోకి సంచలన విషయాలు..!

ఈ కేసు విచారణలో రాహుల్ గాంధీపై 10కి పైగా క్రిమినల్ పరువునష్టం కేసులు నడుస్తున్నాయని పూర్ణేష్ మోదీ తరపున తెలిపారు. సుప్రీంకోర్టు కూడా మందలించింది. ప్రధాని మోదీ తరఫు న్యాయవాది హర్ష్ టోలియా మాట్లాడుతూ.. కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నారని అన్నారు. కోర్టు విధించిన శిక్ష కారణంగా రాహుల్ గాంధీ అనర్హత వేటు పడింది. కానీ ఎన్నికల గురించి, దాని గెలుపుపై ​​వాదిస్తున్నారు. రాహుల్ గాంధీకి సరైన శిక్ష పడిందని, ర్యాలీలో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన పూర్తిగా స్పృహలో ఉన్నారని లాయర్ అన్నారు.

Exit mobile version