Site icon HashtagU Telugu

Anura Kumara Dissanayake : ప్రధాని మోడీతో శ్రీలంక అధ్యక్షుడు భేటీ

Sri Lankan President Dissanayake meet Prime Minister Modi

Sri Lankan President Dissanayake meet Prime Minister Modi

Anura Kumara Dissanayake : మూడురోజుల పర్యటన కోసం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అక్కడికి చేరుకోగానే పొరుగు దేశాల నేతలు ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. ప్రధాని మోడీ, అనుర దిసానాయక్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ వివరించారు.

ఈ ఉదయం శ్రీలంక అధ్యక్షుడు దిసానాయకే రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ పర్యటనలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా సహకారంపై జరిగినట్లు తెలిపారు. నైబర్‌హుడ్‌ ఫస్ట్‌ విధానం, సాగర్‌ ఔట్‌లుక్‌కి శ్రీలంక కీలకమైందని.. ప్రధాని మోడీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే పేర్కొన్నారు.

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే సెప్టెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి వచ్చిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఢిల్లీకి చేరుకున్న తర్వాత అధ్యక్షుడు దిసానాయక్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లను కూడా కలిశారు. ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, దిసానాయక్ ఇలా అన్నారు. “నా అధికారిక పర్యటన సందర్భంగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్‌తో ఉత్పాదక చర్చల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. మా సంభాషణలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఇండో-శ్రీలంక ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం, ప్రాంతీయ భద్రతను పెంపొందించడం మరియు పర్యాటకం వంటి కీలక రంగాలను అభివృద్ధి చేయడం మరియు ఈ నిశ్చితార్థాలు మన రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే నిబద్ధతను పునరుద్ఘాటిస్తాయి అన్నారు.

Read Also: YS Jagan: జగన్ మాస్టర్ స్కెచ్! మతాల మధ్య తగాదాలకు జగన్ ప్రయత్నం?