సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న స్పైస్ జెట్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో 197 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ విషయంపై హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా జెడ్డా నుండి కోజికోడ్కు స్పైస్జెట్ విమానాన్ని కొచ్చికి మళ్లించినట్లు డిజిసిఎ తెలిపింది. ప్రయాణికులందరితో విమానం కొచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఆ విమానంలో 6 మంది సిబ్బందితో సహా 197 మంది ప్రయాణికులు ఉన్నారని విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు. కోజికోడ్ విమానాశ్రయంలో స్పైస్జెట్-ఎస్జి 036 విమానాన్ని కొచ్చి వైపు మళ్లించిన తర్వాత, సాయంత్రం 6.29 గంటలకు విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ ప్రకటించామని ఆయన చెప్పారు. సాయంత్రం 6.29 గంటలకు కొచ్చి విమానాశ్రయంలో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత 7.19 గంటలకు విమానం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది.
కొంత కాలంగా విమాన ప్రయాణంలో పలుమార్లు ఆటంకాలు ఎదురవుతున్నాయి. స్పైస్జెట్, విస్తారా, ఇండిగో, గో ఎయిర్ అనేవి ప్రజలు తరచుగా ప్రయాణించే విమానాలు. ఈ విమానాల నుంచి ఇలాంటి కేసులు నిరంతరం వెలుగు చూస్తున్నాయి. ఈ లోపాల వల్ల విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ జరుగుతున్నాయి.