UP municipal election 2023: 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే పట్టణ సంస్థల ఎన్నికలను రాజకీయ పార్టీలు సెమీ ఫైనల్స్గా చూస్తున్నాయి. ఈసారి పౌర ఎన్నికల్లో ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు ఉన్న పెద్ద నగరాలపై సమాజ్వాదీ దృష్ఠి సారించింది. ఈ నేపథ్యంలో రాబోయే మునిసిపల్ ఎన్నికలకు సీనియర్ లీడర్లను రంగంలోకి దింపింది. వారిని బూత్ కమిటీల ఏర్పాటుకు లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్లుగా నియమించింది. మునిసిపల్ కార్పొరేషన్లలో అత్యధిక సంఖ్యలో కౌన్సిలర్లను గెలిపించడానికి, పార్టీ అసెంబ్లీ వారీగా ఇన్చార్జ్లను కూడా నియమించింది.
సమాజ్వాదీ పార్టీ మాజీ మంత్రి, అసెంబ్లీ చీఫ్ విప్ మనోజ్ కుమార్ పాండేకు రాయ్ బరేలీతోపాటు వారణాసి బాధ్యతలు అప్పగించారు. ఖుషీనగర్లో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్యకు అప్పగించారు. వారణాసి మేయర్, కౌన్సిలర్లను గెలిపించడమే మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఓం ప్రకాష్ సింగ్ టార్గెట్.
పార్టీ ఎమ్మెల్యే అషు మాలిక్ సోదరుడు నూర్ హసన్ మాలిక్ సహరాన్పూర్ నుంచి మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సీటును గెలిపించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. మీరట్లో సర్ధాన ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ భార్య సీమా ప్రధాన్కు మేయర్ టికెట్ దక్కింది. ఎస్పీ తన ఆర్య నగర్ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ భార్య వందనా బాజ్పాయ్కు కాన్పూర్ మేయర్ టిక్కెట్ను కూడా ఇచ్చింది. ఈ సీట్ల గెలుపు ఓటమి పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేల స్థాయిని కూడా నిర్ణయిస్తుంది.
లక్నోలో పార్టీ అభ్యర్థి వందనా మిశ్రా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతను మాజీ మంత్రి అరవింద్ సింగ్ గోపేకు అప్పగించారు. అనేక చోట్ల మేయర్ మరియు మున్సిపాలిటీ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ తన సీనియర్ నాయకులకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించింది. శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్కు ఇటావా బాధ్యతలు అప్పగించారు. చాలా స్థానాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్లను పార్టీ నియమించింది. కాగా.. ఫలితాలు చూసి చాలా మంది నేతలకు లోక్సభ టిక్కెట్ను పార్టీ అధిష్ఠానం ఇచ్చే అవకాశం ఉంది.
Read More: Mouni Roy : వానలో తడుస్తూ మౌని రాయ్ హాట్ ఫోజులు