Sonia Gandhi : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై కేంద్రం మౌనం : సోనియా గాంధీ విమర్శలు

టెల్‌ అవీవ్‌ చేస్తున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యలుగా సోనియా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.

Published By: HashtagU Telugu Desk
Sonia Gandhi criticizes the Centre silence on the Israel-Iran war

Sonia Gandhi criticizes the Centre silence on the Israel-Iran war

Sonia Gandhi :   ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త యుద్ధ పరిస్థితిపై భారత ప్రభుత్వం మౌనం వహించడం దౌత్య పరంగా విఫలమైందని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ ఘర్షణల విషయంలో కేంద్రం తీసుకుంటున్న తటస్థ వైఖరి, భారత్‌ అనుసరిస్తున్న చారిత్రక నైతిక ధోరణి మరియు వ్యూహాత్మక సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. టెల్‌ అవీవ్‌ చేస్తున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యలుగా సోనియా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.

Read Also: Rythu Maha Dharna : ఎనుముల రెడ్డి కాదు.. కోతల రేవంత్ రెడ్డి – హరీశ్ రావు

ఈ సమయంలో ఇరాన్ మరియు అమెరికాల మధ్య అణు చర్చలకు మార్గం సిద్ధమవుతుండగా, ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌లోని అణు సదుపాయాలపై చేసిన దాడి సరికాదని సోనియా అభిప్రాయపడ్డారు. ఇదొక ఉద్దేశపూర్వక ప్రేరణగా అభివర్ణిస్తూ, గాజాలో జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తుచేశారు. గాజా హోరెత్తించే మారణహోమంలో ఇప్పటివరకు 55,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. గాజా ప్రస్తుతం కరవు అంచున ఉందని, అక్కడి ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని సోనియా వివరించారు. ఇలాంటి దుస్థితి మళ్లీ ఇరాన్‌లో పునరావృతం కాకుండా, ఇంకా ఆలస్యం కాకముందే భారత్‌ మౌనం వీడి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. భారత దేశానికి ఇరాన్ మరియు ఇజ్రాయెల్‌లతో దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని, ఇరువైపులా చారిత్రక, వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయని సోనియా గుర్తు చేశారు. ఇటీవలి కాలంలో న్యూఢిల్లీ-టెల్‌అవీవ్ మధ్య రక్షణ, వాణిజ్య, నిఘా రంగాల్లో సహకారం పెరిగినా, టెహ్రాన్‌తో కూడా భారత దేశానికి బలమైన నాగరిక సంబంధాలు ఉన్నాయని ఆమె వివరించారు.

ఈ క్రమంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఇరుదేశాల మధ్య చర్చలకు వేదికగా నిలవాల్సిన అవసరం భారత్‌ పట్ల ఉందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఇక, ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంలో శుక్రవారం ఇరాన్ దౌత్యవేత్త మొహమ్మద్ జావాద్ హొస్సేనీ మాట్లాడుతూ, ఇజ్రాయెల్‌ చేస్తున్న దురాక్రమణలను బహిరంగంగా ఖండించాల్సిన అవసరం ఉందని, భారత్ సహా ప్రపంచ దేశాలు దీనిపై గట్టి స్పందన ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశ్చిమాసియా మూడేలు మంటలో ఉంటే, నిశ్శబ్దంగా ఉండడం మన చారిత్రక బాధ్యతకు వ్యతిరేకమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Also: DGCA : విమాన ప్రమాదం ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు

  Last Updated: 21 Jun 2025, 01:47 PM IST