Sheikh Hasina: భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా.. కారణమిదే..?

Sheikh Hasina: ప్రస్తుతం భారత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో ఘనస్వాగతం పలికారు. బంగ్లాదేశ్ ప్రధానికి ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌లో పర్యటించిన తొలి విదేశీ నాయకురాలు షేక్ హసీనా కావడం విశేషం. ఆమె రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నప్పుడుహసీనాకు ప్రాంగణంలో లాంఛనంగా […]

Published By: HashtagU Telugu Desk
Sheikh Hasina

Sheikh Hasina

Sheikh Hasina: ప్రస్తుతం భారత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో ఘనస్వాగతం పలికారు. బంగ్లాదేశ్ ప్రధానికి ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌లో పర్యటించిన తొలి విదేశీ నాయకురాలు షేక్ హసీనా కావడం విశేషం. ఆమె రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నప్పుడుహసీనాకు ప్రాంగణంలో లాంఛనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె మర, ప్రధాని మోదీ కూడా రెండు దేశాల మంత్రులు, ప్రతినిధులను కలిశారు.

అక్కడ స్వాగతం పలికిన అనంతరం హసీనా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. హసీనా ప్రధాని మోదీతో ఒకరితో ఒకరు సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రతినిధి స్థాయి చర్చలు జరుగుతాయి. సంభావ్య వాణిజ్య ఒప్పందాలు చర్చించబడతాయని సమాచారం. నివేదికల ప్రకారం.. గత దశాబ్దంలో బలమైన ప్రాంతీయ భాగస్వామ్య ప్రణాళికలో భాగంగా అనేక క్రాస్-బోర్డర్ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. అవగాహన ఒప్పందం (ఎంఓయు) సంతకాల కార్యక్రమానికి ఇరువురు నేతలు హాజరై పత్రికలకు ప్రకటనలు ఇవ్వనున్నారు. ప్రధాని మోదీ తన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు హసీనా కూడా హాజరుకానున్నారు. అనంతరం బంగ్లాదేశ్‌ ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌లను కలుస్తారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం సాయంత్రం హసీనాను కలిశారు.

Also Read: Onions: ఉల్లిపాయ తినడం వల్ల కలిగే లాభనష్టాలు ఇవే?

15 రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించబడిన నాయకులలో ఆమె కూడా ఉన్నారు. భారతదేశం “నైబర్ ఫస్ట్” విధానంలో బంగ్లాదేశ్ ఒక ముఖ్యమైన భాగస్వామి. గంగా జలాల పంపిణీ ఒప్పందాన్ని పునరుద్ధరించడంపై కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉందని సమాచారం. 1975లో గంగా నదిపై భారతదేశం ఫరక్కా డ్యామ్‌ను నిర్మించిందని, దానిపై బంగ్లాదేశ్ అసంతృప్తి వ్యక్తం చేసిందని, ఆ తర్వాత 1996లో గంగా జలాల భాగస్వామ్య ఒప్పందంపై భారత్, బంగ్లాదేశ్ సంతకాలు చేశాయని చెబుతుంటారు. విశేషమేమిటంట.. ఈ ఒప్పందం కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. ఇది వచ్చే ఏడాది ముగియనుంది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 22 Jun 2024, 11:26 AM IST