కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేస్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోన్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. సంస్థాగత సంస్కరణలు కోరుతూ యువ కాంగ్రెస్ సభ్యుల బృందం పంపిన అభ్యర్థనను ట్విట్టర్ వేదికగా సమర్థించిన రోజే ఆయన సోనియాను కలవడం విశేషం. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేయాలని కోరుతోన్న ఆయన జీ 23 సభ్యుల్లో ఉండడం గమనార్హం.
మేలో కాంగ్రెస్ నాయకత్వం ఆమోదించిన “ఉదయ్పూర్ డిక్లరేషన్` పలు సంస్కరణలను సూచిస్తోంది. అంతర్గత ఎన్నికలు, కుటుంబానికి ఒక అభ్యర్థి, ఒక పదవికి ఒక వ్యక్తిని అనుమతించడం, పదవులపై ఐదేళ్ల పరిమితితో పాటు పార్టీ నిబద్ధతను ఆ డిక్లరేషన్ లో పొందుపరిచి ఉంది. తాజాగా కాంగ్రెస్ యువ బృందం సంస్కరణలు కోరుతూ పోస్ట్ చేసిన లేఖపై ఇప్పటి వరకు 650 మందికి పైగా సంతకం చేశారు. ఆ బృందం పంపిన ఈ లేఖను శశిథరూర్ స్వాగతించారు. ఆ లేఖను ఆమోదించడం, దానిని అధిగమించడం నాకు సంతోషంగా ఉంది” అని మాజీ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
I welcome this petition that is being circulated by a group of young @INCIndia members, seeking constructive reforms in the Party. It has gathered over 650 signatures so far. I am happy to endorse it & to go beyond it. https://t.co/2yPViCDv0v pic.twitter.com/waGb2kdbTu
— Shashi Tharoor (@ShashiTharoor) September 19, 2022
రాహుల్ గాంధీ చీఫ్గా ఉండాలనే ఉద్దేశ్యంతో అక్టోబర్లో కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలకు వెళుతోంది. శక్తివంతమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)కి రాష్ట్ర యూనిట్ చీఫ్లు, సభ్యులను ఎన్నుకోవాలని రాష్ట్ర యూనిట్లను కోరాలను సోనియాను యువ కాంగ్రెస్ లీడర్ల బృందం కోరింది. అంతర్గత సంస్కరణలను కోరుతూ జీ 23 గత ఏడాది సోనియాకు లేఖలు రాసిన విషయం విదితమే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని మూడు రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలు కోరాయి. మరిన్ని రాష్ట్రాలు అనుసరించవచ్చు.
ఎన్నికలకు బదులుగా ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రయత్నాన్ని సంస్కరణల ఆలోచన చేస్తోన్న వాళ్ల ఆలోచనను దెబ్బతీస్తుంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని శశిథరూర్ తోసిపుచ్చలేదు. ఎన్నికలు జరగడం పార్టీకి మంచిదని చెబుతున్నారు. ఆయన పోటీపై చాలా మంది కాంగ్రెస్ లీడర్లు స్పందించారు. కొందరు మద్థతు పలికారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ భిన్నాభిప్రాయాల తన అభ్యర్థిత్వంపై రావడాన్ని స్వాగతించారు. ఇలాంటి పరిణామాల నడుమ సోనియాతో ఆయన భేటీ కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.