The Disaster Management (Amendment) Bill : నేడు లోక్ సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా

The Disaster Management (Amendment) Bill : ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏయే అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎవరినెక్కడ మోహరించాలి, బాధితుల భద్రత, పునరావాసం, కేంద్ర రాష్ట్రాల బాధ్యతల్లో విభజన వంటివి ఈ బిల్లులో నిర్వచిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Amith Sha Loksabha

Amith Sha Loksabha

కేంద్ర హోంమంత్రి అమిత్ (Union Home Minister Amit Shah) నేడు విపత్తు నిర్వహణ సవరణ బిల్లు (The Disaster Management (Amendment) Bill)ను లోక్ సభ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏయే అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఎవరినెక్కడ మోహరించాలి, బాధితుల భద్రత, పునరావాసం, కేంద్ర రాష్ట్రాల బాధ్యతల్లో విభజన వంటివి ఈ బిల్లులో నిర్వచిస్తారు.

విపత్తు నిర్వహణ సవరణ బిల్లు అనేది దేశంలో ప్రకృతి లేదా మానవసృష్టి విపత్తులను సమర్థవంతంగా నిర్వహించడానికి కేంద్రం తీసుకువచ్చే చట్టసవరణ. ఇది ఇప్పటికే ఉన్న “విపత్తు నిర్వహణ చట్టం, 2005” (Disaster Management Act, 2005)లో మార్పులు చేసి, తక్షణ సహాయం, సమన్వయం, బాధితుల పునరావాసం, మరియు భవిష్యత్తు విపత్తుల నివారణకు మరింత శ్రద్ధ పెట్టడానికి రూపొందించబడింది.

ఈ బిల్లు (The Disaster Management Bill)లో ప్రధాన లక్ష్యాలు :

విపత్తుల సమయంలో అధికారులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించడంలో మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం వంటివి. అలాగే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పని చేయాలో, ఎవరి బాధ్యతలు ఏమిటో స్పష్టంగా నిర్వచించడం. విపత్తు సంభవించినప్పుడు తక్షణ సహాయం అందించేందుకు అవసరమైన నిధులు, సాంకేతిక వనరులు, మానవ వనరుల సమీకరణ. విపత్తుల కారణంగా ప్రభావితమైన ప్రజలకు తక్షణ సహాయం అందించడం..
పునరావాసం ప్రక్రియను వేగవంతం చేయడం, నష్టాలను తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడం.
పారదర్శకతతో డేటా ఆధారిత నిర్ణయాలను తీసుకోవడం వంటివి ఈ బిల్లులో ఉంటాయి.

  Last Updated: 29 Nov 2024, 11:32 AM IST